–తెలంగాణ ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్
–కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ
–కాలవ్యవధితో కూడిన జాబ్ క్యా లెండర్
–మూసీ ప్రక్షాళనకు 15 టీఎంసీల గోదావరి నీళ్లు తరలింపు
–ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీ ర్ అలీఖాన్ లే ప్రతిపాదనలు
–నిఖత్ జరీన్, సిరాజ్లకు గ్రూప్– 1 ఉద్యోగం, 600 గజాలు,ఈషాసిం గ్ కు స్థలం
— సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రజల ఆరోగ్యం పై సమగ్ర నివేదిక రూపొందించేందుకు రేవం త్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం నిశ్చయించింది. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో రాష్ట్రం లో జాబ్ క్యాలెండర్ (Job Calendar) ప్రకటించడమే కాకుం డా దానికి చట్టబద్ధత కూడా కల్పిం చాలని, ప్రతిఏటా క్యాలెండర్ను ప్రకటించేలా ఒక విధానం తీసుకరా వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయిం చింది. శుక్రవారం అసెంబ్లీలోనే ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్పై ప్రకటన చేయ నున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలుండే గ్రామాలు, మునిసిపాలి టీల విలీనంపై అధ్యయనం చేసేం దుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పా టు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం క్యాబినె ట్ సమావేశం లో ఈ మేరకు ఆయ న నిర్ణయం తీసుకున్నారు.
రంగా రెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి (Ranga Reddy, Medchal, Sangareddy) జిల్లాల పరిధి లో ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న 44 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించారు. ఈ గ్రా మాలను ముందుగా సమీపాన ఉన్న మునిసిపాలిటీలలో విలీనం చేసి ఆ తర్వాత ఆయా మునిసిపా లిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం పురపా లక శాఖ (Purapa Laka branch)సీఎం వద్దనే ఉన్నందున మంత్రివర్గ ఉపసంఘం లో సభ్యు లుగా ఎవరిని నియమిస్తారనే దాని పై ఆ శాఖ అధికారుల్లో చర్చ జరు గుతోంది.సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponguleti Srinivasa Reddy, Ponnam Prabhakar Goud)వెల్లడించారు. పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఆర్భా టాలు తప్ప, ఆచరణలో ఏ పనులు సక్రమంగా చేయలేదన్నారు. కేసీఆ ర్ పాలనలో పేద ప్రజల కష్టాలు పట్టించుకోలేదని అన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ (Ration cards, Arogyashri)కార్డులు కూడా జారీచేయలేదని అన్నారు. తెలంగా ణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ను గత ప్రభుత్వం ఎలా గౌరవించిందో ప్రజలు చూశారని అన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులగణన చేప ట్టే పనిలో ఉన్నామని, ఓటర్ లిస్టు విడుదలచేస్తామని, పంచాయ తీరాజ్ శాఖకు ఓటర్ల జాబితా వచ్చి న తర్వాత అన్ని సరిచూసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జీవో నంబరు– 317, జీవో– 46, 2008 డీఎస్సీ, 1998 డీఎస్సీ తదితర సమస్యలన్నింటికి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుంద ని ఆయన ప్రకటించారు. హుస్నా బాద్ ప్రాంతంలో గౌరవెళ్లి ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం రూ. 437 కోట్లు కేటా యించటం హర్షణీయమని అన్నా రు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పను లు పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించారు. భర్తీచేస్తారనే వివరాలను కూడా సభలోనే చెప్పను న్నారు.
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు, భర్తీచేసే ఉద్యో గాలు, నియామకాలకు నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జాబ్ క్యా లెండర్పై విపక్షాలు ఇచ్చే సలహా లు, సూచనలు కూడా స్వీకరిస్తా మని తెలిపారు. పేదలకు కొత్త రేషన్కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా జారీచేయాలని క్యాబి నెట్ నిర్ణయించింది. కొత్త కార్డుల జారీకి విధివిధానాల కోసం మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. ఇందులో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ చైర్మన్గా, మంత్రులు దామోదర, పొంగులేటి సభ్యులుగా ఉంటారు. నెల రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయాలని గడువు పెట్టారు. ప్రభు త్వానికి సబ్కమిటీ నివేదిక ఇవ్వ గానే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ విడివిడిగా ప్రారం భించాలని నిర్ణయించారు. తెలంగా ణ ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్, సియాసత్ ఎడిటర్ ఆమెర్ అలీఖా న్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా గతంలో ప్రతిపాదిస్తే రాజ్భవన్ నుంచి ఫైల్ తిరిగొచ్చింది. అప్పటి గవర్నర్ ఆమోదం తెలపలేదు.
తాజా క్యాబినెట్ సమావేశంలో మళ్లీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చించారు. కోదండరా మ్, ఆమెర్ అలీఖాన్ పేర్లనే ఎమ్మె ల్సీలుగా ప్రతిపాదిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. క్రీడాకారులు నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్, ఈషా సింగ్లకు 600 గజాల చొప్పున హైదరాబాద్లో ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. నిఖత్, సిరాజ్లకు గ్రూప్–1 కేడర్ ఉద్యో గాలు కూడా ఇవ్వాలని నిర్ణయిం చారు. విధి నిర్వహణలో మృతిచెం దిన ఇంటలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ తనయుడు హరి రతన్కు మున్సిప ల్ కమిషనర్గా ఉద్యోగం, దివంగత అడిషన్ డీజీ పి. మురళి తనయు డికి డిప్యూటీ తహసీల్దారు ఉద్యో గమివ్వాలని నిర్ణయించారు.
గోదా వరి జలాలను మల్లన్నసాగర్ నుంచి శామీర్పేట చెరువుకు తరలించి, అక్కడ నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు నింపి తాగు నీటి సరఫరా చేయాలని రాష్ట్ర మం త్రివర్గం నిర్ణయించింది. గ్రేటర్ హైద రాబాద్ బయట, ఔటర్ రింగురోడ్డు లోపల ఉండే అర్బన్ ప్రాంతం తాగు నీటి అవసరాలకు 10 టీఎంసీలు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి అవసరాలు తీరుస్తున్న జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తోపాటు మూసీలో నిరంతరం పరి శుభ్రమైన జలాలు ప్రవహించటానికి 5 టీఎంసీలు కేటాయించారు. మొ త్తం 15 టీఎంసీల గోదావరి జలా లను తాగునీటి అవసరాలు, మూసీ ప్రక్షాళనకు వినియోగించాలని మం త్రివర్గం నిర్ణయించింది. హుస్నా బాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు, భూసేకరణ, ఇతరత్రా పనులకు రూ. 437 కోట్లు కేటాయి స్తూ నిర్ణయం తీసుకున్నారు. రివైజ్ డ్ ఎస్టిమేట్స్కు ఆమోదం తెలపటం తోపాటు యుద్ధప్రాతిపదికన పను లు పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించా రు.
నిజాం చక్కెర కర్మాగారం పునరుద్ధరణ …దశాబ్దకాలంగా మూతపడి ఉన్న నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు మంత్రి శ్రీధర్బాబు చైర్మన్ గా వేసిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలమేరకు రెండో విడత బకాయిల విడుదలకు మం త్రివర్గం ఆమోదం తెలిపింది. ఇథ నాల్, విద్యుదుత్పత్తి అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయా లని సబ్కమిటీకి బాధ్యతలు అప్ప గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ధర ణి సమస్యలపై అసెంబ్లీలో స్వల్ఫ కాలిక చర్చ నిర్వహించాలని భేటీ లో నిర్ణయించారు. ‘ధరణి’ పేరును ‘భూమాత’గా మారుస్తారని చర్చ జరుగుతోంది. రైతుభరోసాపై రైతు లు, రైతుసంఘాల నుంచి వచ్చిన అభిప్రాయాలను శుక్రవారం అసెంబ్లీ లో చర్చించి, ఆ తర్వాత మార్గద ర్శకాలను వెల్లడించాలని నిర్ణయిం చినట్లు సమాచారం. కేరళలోని వయనాడ్ విపత్తుపై క్యాబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలి పింది. వైద్య సాయం, ఆహార ధాన్యాలు, ఇతరత్రా వసతుల కల్పన ద్వారా కేరళకు ఆపన్నహస్తం అందించాలని నిర్ణయించింది.
గ్రేటర్ శివారు మునిసిపాలిటీల విలీనం గ్రేటర్ హైదరాబాద్లో (Greater Hyderabad) ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోప లుండే గ్రామాలు, మునిసిపాలిటీల విలీనంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదే శించారు. గురువారం క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధి లో ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న 44 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఈ గ్రామాలను ముందుగా సమీపాన ఉన్న మునిసిపాలిటీలలో విలీనం చేసి ఆ తర్వాత ఆయా మునిసి పాలిటీలను జీహెచ్ఎంసీలో విలీ నం చేయనున్నారు. ప్రస్తుతం పుర పాలక శాఖ సీఎం వద్దనే ఉన్నందు న మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యు లుగా ఎవరిని నియమిస్తారనే దాని పై ఆ శాఖ అధికారుల్లో చర్చ జరు గుతోంది.