Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకెసీ) డాని యెలా కాంబ్ (Daniela Combe) గారు మర్యాదపూర్వకంగా కలి శారు. హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సదస్సు ప్రాంగణంలో వీరు సమా వేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎక రాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తా వించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలం గాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ గారు ఆసక్తి కనబ రిచారు. ఈ సమావేశంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
