Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: పునర్విభజన చట్టం పుట్టెడు సమస్యలు

–కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు
–చట్టసభల్లో, కోర్టుల్లో గట్టిగా వా దించాల్సి ఉన్నందునే’ సింఘ్వీ’ ఎంపిక
–రాజ్యసభ సభ్యునిగా సింఘ్వీ సేవలను వినియోగించుకుందాం
–తెలంగాణ సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగపరంగా, న్యాయపరంగా అనేక పుట్టెడు సమస్యలు ఉన్నా యని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)అన్నారు. ఈ చట్టాన్ని కేంద్రం పదేళ్లుగా అమ లు చేయడం లేదన్నారు. పునర్విభ జన చట్టంలోని అంశాలపై చట్టస భలతో పాటు సుప్రీంకోర్టులోనూ బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందు కే రాజ్యాంగ, న్యాయకోవిదుడైన అభిషేక్ మను సింఘ్వీని తెలంగా ణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు రేవంత్ (Revanth Reddy) ల్లడించారు.అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం చట్టస భలు, న్యాయస్థానాల్లో సింఘ్వీ గట్టిగా వాదనలు వినిపిస్తారని ఆకాంక్షించారు.

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ (Singhvi) పేరు ను తాము ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టా నానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో (Rajya Sabha by-elections) కాంగ్రెస్ అభ్యర్థిగా సిం ఘ్వీ నామినేషన్ దాఖలు చేయ నున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మె ల్యేలకు ఆయన ను పరిచయం చేసేందుకు నానక్ రామ్ గూడలోని ఓ హెూటల్లో ఆదివారం సీఎం రేవం త్ రెడ్డి సీఎల్పీ సమావేశాన్ని ఏర్పా టు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మం త్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్చార్జి దీపాదాస్ మున్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ అభ్య ర్థిగా సింఘ్వీని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశా రు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమో దించినందుకు అధిష్టానానికి ధన్య వాదాలు తెలుపుతూ చేసిన తీర్మా నాన్ని సీఎల్పీ ఆమోదించింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు.

ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు పెద్ద మనసుతో క్రమ శిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త లాగా వ్యవహరించారని ప్రశం సించారు. ఇక వరంగల్ లో రైతు కృతజ్ఞత సభ త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఈ నెల 20న చేపట్టాలని భావించినా వీలు కాలేదని తెలిపారు. రైతు కృతజ్ఞత సభ, రాజీవ్ విగ్రహావిష్కరణపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడి త్వరలోనే తేదీ లను వెల్లడిస్తామని చెప్పారు. రా జ్యసభ సింఘ్వీ మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక కానుందడాన్ని తనకు లభిం చిన గౌరవంగా భావిస్తున్నానన్నా రు.భూస్వామ్య వ్యతిరేక పోరా టానికి, మహిళా సాధికారతకు తె లంగాణ ప్రాంతం ప్రతీక అని కొని యాడారు. దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలం గాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరి స్థితుల్లో కాంగ్రెస్ మరింత క్రియా శీలంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పని చేశానని, విద్య, వైద్యంతో పాటు అనేక సమస్యలపై పెద్దల సభలో గళం వినిపించానని తెలిపారు.

ఇదిలా ఉండగా రాజ్యసభ అభ్య ర్థిగా నామినేషన్ దాఖలు చేసేందు కు హైదరాబాద్ కు సతీసమేతంగా వచ్చిన అభిషేక్ మను సింఘ్వీ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ను మర్యా దపూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా సింఘ్వీని సీఎం రేవంత్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. అంత కుముందు ఆదివారం ఉదయం శం షాబాద్ విమానాశ్రయానికి చేరు కున్న సింఘ్వీకి ఎంపీ మల్లురవి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు.అక్కడి నుంచి సింఘ్వీ నేరుగా కేకే ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లా రు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సింఘ్వీ దంప తులకు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి తీసుకొచ్చిన ప్రసా దాన్ని అందజేశారు. ఆ తర్వాత ప్రజాభవన్ కు వెళ్లిన సింఘ్వీ డిప్యూటీ సీఎం భట్టితో మర్యా దపూర్వకంగా భేటీ అయ్యారు.

కాగా, రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సోమవారం ఉ దయం 11 గంటలకు అభిషేక్ మ ను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయ నున్నారు. సింఘ్వీ అభ్యర్థి త్వాన్ని ప్రతిపాదిస్తూ సీఎల్పీ సమా వేశంలోనే పలువురు ఎమ్మెల్యేల సంతకాల సేకరణను కూడా పూర్తి చేశారు. ఈ సీటుకు పోటీ చేసి గెలి చేంత సంఖ్యాబలం శాసనసభలో ఇతర ఏ పార్టీకీ లేదు. కాబట్టి సింఘ్వీ ఎన్నిక లాంఛనమే కావడం గమనార్హం.

ప్రభాస్ సినిమాపై.. విజయానికి, విశ్వాసానికి క్షత్రియులు మారు పేరని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యా ప్తం చేశారని కొనియాడారు. ప్రభాస్ కాకుండా వేరేనటుడిని బాహుబలి స్థానంలో ఊహించుకోలేమన్నారు. కర్ణాటక,తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రె స్ విజయంలో బోసురాజు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాజకీయాల్లో క్షత్రియ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పి స్తామని, నగరంలో క్షత్రియ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొని, ప్రసంగించారు. 1960ల లో నే క్షత్రియులు ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి.. ద్రాక్ష తోటలు, పౌల్ట్రీ వంటి వ్యాపారాలు నిర్వహించారని.. శ్రమ, అకుంఠిత దీక్షతో ఉన్నతస్థాయికి ఎదిగారని రేవంత్ రెడ్డి వివరించారు.

కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయవంతమ వుతారన్నారు. “క్షత్రియులకు రాజకీయాల్లో తగిన ప్రోత్సాహం అందిస్తాం. మీరే తగిన పేర్లు ఇస్తే.. వారికి పార్టీ పదవులు ఇచ్చి.. కార్పొరేటర్, ఎమ్మెల్యే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాం” అని క్షత్రియ సేవాసమితిని కోరారు. ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు, తెలంగాణలో కొమరం భీం పోరాట యోధుల స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నామ న్నారు. హైదరాబాద్ శివారులో ప్యూచర్సిటీని అభివృద్ధి చేయబో తున్నామని, దానిలో కూడా రాజులు భాగస్వాములు కావాల న్నారు. ధాన్ని గుర్తుచేసుకున్నారు.

పెట్టుబడులతో ముందుకొస్తే అన్నివిధాల ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. హైదరాబాద్ అభివృద్దిలో క్షత్రియ కమ్యూనిటీ భాగస్వామ్యం ఉందన్నారు. కర్ణాటకలో రాజకీయ సమీకరణలు, పరిస్థితుల ప్రభావం (Influence of political mobilizations and circumstances)వల్ల బోసురాజుకు పోటీచేసే అవకాశం రాలేదన్నారు. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో మంత్రి పదవి కేటాయించాలని స్వయంగా రాహుల్గాంధీ చెప్పారని గుర్తుచేశారు.దీన్ని బట్టి.. రాజులు క్రమశిక్షణతో పనిచేస్తారనే అభిప్రా యం అధిష్టానంలో ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా శ్రీనివాసరాజును నియమించడం రాజులపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ప్రతీక అన్నారు. “క్షత్రియభవన్ స్థలాన్ని మేము అందిస్తాం, భవనాన్ని మీరు నిర్మించండి మళ్లీ జరిగే సమావేశం క్షత్రియ భవన్ లో జరుపుకుందాం” వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రాష్రకూర్, క్షత్రియ సేవాసమితి అధ్యక్షుడు నాగరాజు, నాని (Nagaraju, Nani)పాల్గొన్నారు.