Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: ఏచూరి స్ఫూర్తితో మా పోరాటాలు కొనసాగిస్తాం

–ఆ క్రమంలో జమిలీ ఎన్నికలను అడ్డుకొని తీరుతాం
–న‌మ్మిన సిద్ధాంతం కోసం నిల‌బ‌ డిన నేత ఏచూరి
— బిజెపి జ‌మిలీ పేరుతో కుట్ర‌కు పాల్ప‌డుతోంది
–దేశాన్ని క‌బ‌లించేందుకే మోడీ జ‌మిలీ రాగం
–ఈ విపత్తు స‌మ‌యంలో ఏచూరి లేక‌పోవ‌డం దుర‌దృష్టం
–సీతారాం ఏచూరి సంస్మ‌ర‌ణ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్: కామ్రేడ్ ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటామ‌ని, పో రాడుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy)జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబ ళించాలని బీజేపీ చూస్తున్న స‌మ‌ యంలో సీతారాం ఏచూరి మ‌న‌కు దూరం కావ‌డం అంతులేని అవేద‌ న‌ను మిగిల్చింద‌న్నారు. హైదరా బాద్ రవీంద్ర భారతిలో శనివారం జ‌రిగిన సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి (Comrade Sitaram Yechury)సంస్మర ణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీతారాం ఏచూ రిపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిం చారు.అనంత‌రం రేవంత్ మాట్లా డుతూ తాను పీసీసీ అధ్యక్షుడ్ని అయ్యాక రెండు సార్లు కలిశానని తెలిపారు. సీతారాం ఏచూరితో (Comrade Sitaram Yechury)మాట్లాడితే జైపాల్ రెడ్డితో మాట్లా డినట్టు ఉండేదన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడే వారు చాలా అరుదని తెలిపారు. నేను ఈ దేశానికి అంకితం అని చాలా మంది ఉపన్యాసాల్లో చెబుతుంటా రు కానీ ఆచరణలో కాదన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశా న్ని కబళించాలి అనుకున్నప్పు డు సీతారాం ఏచూరి లేకపోవడం తీర ని లోటన్నారు. ఇక రాహుల్ గాంధీ కి ఏచూరికి చాలా సన్నిహితంగా ఉంటారన్నారు. యుపిఎ -1,2 ఏర్పాటులో అనేక చట్టాలు తెచ్చి నప్పుడు పేదలకు అనుకూలమైన నిర్ణయల్లో ఏచూరి పాత్ర ఎంతో ఉన్న‌ద‌ని అన్నారు.

జ‌మిలీ ముసుగులో (Jamili mask) దేశాన్ని క‌బ‌లించే కుట్ర జ‌మిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకో వడానికి బీజేపీ ప్రయత్నాలు చే స్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల ముసుగు లో దేశాన్ని కబళించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పులుసవరణలు విషయంలో బీజేపీ (bjp) అవలంబిస్తున్న తీరు చూస్తున్నామన్నారు. యూని యన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్ ను దెబ్బతీ యాలని బీజేపీ చూస్తుందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరే కంగా అం(దరూ పోరాడాలని రేవం త్ ఈ వేదిక‌పై నుంచి అన్ని పార్టీల‌ కు పిలుపు ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ (Ravneet Singh) బిట్టు మాట్లాడిన మాటలపై మోదీ ఇప్ప‌టికీ ఖండించలేదన్నా రు. ప్రధాన ప్రతిపక్ష నేతపై అసభ్య భాష మాట్లాడిన మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం మోదీ ఫాసిస్ట్ విధానాలకు నిదర్శనం అని రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.