–త్రైపాక్షిక ఒప్పందంలో కేంద్రం, రాష్ట్రం, డిస్కంలు మోదీ సమక్షంలో 2017 జనవరి 4న సంతకాలు
–మోసపూరిత ఒప్పందాన్ని దాచిన గొప్పలు చెబుతున్నారు
–ఉదయ్ ఒప్పందాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి, బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలి
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: వ్యవసాయానికి విద్యుత్తును సర ఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మీటర్లు పెడతామం టూ కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దానిపై అప్పట్లో అధికారులు సం తకాలు చేశారు. దానికి సంబం ధించిన ఆధారాలివిగో అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు. సంబంధి త ఫైళ్లను అసెంబ్లీలోనే ఉన్న హరీశ్ రావుకు పంపించారు. మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం అదనంగా ఇప్పిస్తానన్న రూ.30 వేల కోట్ల అప్పును తాము తిరస్కరించామం టూ బీఆర్ఎస్ నాయకులు గొప్ప లు చెప్పుకొంటున్నారని, కానీ ఒప్పందం చేసుకున్న విషయాన్ని దాచి పెడుతున్నారని ఆరోపిం చారు. బడ్జెట్పై శనివారం అసెంబ్లీ లో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (BRS MLA Harish Rao)మాట్లాడుతూ మోటార్లకు మీటర్లు పెడితే అదనంగా రూ.30 వేల కోట్ల అప్పునకు అనుమతి ఇస్తామని కేంద్రం చెప్పిందని, అయినా దానిని తాము తిరస్కరించామని పునరు ద్ఘాటించారు. ఈ సందర్భంగా మాత్ర మే కాకుండా వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. గతంలో చేసిసభలో బుకాయించడం సమంజసం కాదని తప్పుబట్టారు. త్రైపాక్షిక ఒప్పందం వివరాలను సభలో బయటపెట్టా రు. సభను, సభ్యులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని హరీశ్రావు చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల విషయంలో వాళ్లేదో కేంద్రంతో నిల బడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నా రు. ఇది అబద్ధం. ఆరు నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల (Distribution Transformers)వద్ద మీటర్లు బిగిస్తామంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర డిస్కంలు 2017 జనవరి 4న త్రైపాక్షిక ఒప్పందం, చేసుకున్నాయి. ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్)లో భాగస్వాములయ్యాయి.
మొత్తం 28 పేజీల అగ్రిమెంట్లో (In the agreement)ఏడో పేజీలో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ ఒప్పందంపై అప్పటి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, సదరన్ డిస్కం తరపున రఘుమా రెడ్డి, నార్త్ డిస్కం తరపున ఎ.గోపాల రావు, కేంద్ర విద్యుత్తు శాఖ తరపు న సంయుక్త కార్యదర్శి డాక్టర్ అరుణ్కుమార్ వర్మ సంతకాలు పెట్టారు. 2017 జూన్ 30లోపు అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు; 2018 డిసెంబరు 31లోపు 500 యూనిట్లకుపైగా విద్యుత్తును (Electricity) వినియోగించే వినియోగదారుల ఫీడర్ల వద్ద, 2019 డిసెంబరు 31లోపు 200 యూనిట్లకుపైగా వినియోగించుకునే వారి ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఒప్పందంలో రాశారు. అంటే.. గృహ, వ్యవసాయ వినియోగదారులు వినియోగించే విద్యుత్తుకు నూటికి నూరు శాతం మీటర్లు బిగిస్తామని సుస్పష్టంగా ప్రధాని మోదీ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు’’ అని వెల్లడించారు.
ఉదయ్ ఒప్పందం, అందులోని కీలక అంశాలను ప్రస్తావించారు. 2017 జూన్ 30వ తేదీకల్లా అన్ని ఫీడర్లకు మీటర్లు పెట్టాలని, 2018 మార్చి 31వ తేదీలోపు గ్రామీణ ప్రాంతాల్లో 11 కేవీ స్థాయి దాకా విద్యుత్ లెక్కలు (Electrical calculations)తీయాలని అందులో ఉందని తెలిపారు. త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసింది వాస్తవమా, కాదా అని నిలదీశారు. సభకు వెంటనే హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకు న్నట్లు ఆయన కూడా సభలో చెప్ప లేదని తప్పుబట్టారు. ఈ ఒప్పందం అమలు చేయకపోతే, స్మార్ట్ మీట ర్లు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం డిస్క మ్లపై చర్యలు తీసుకునే అవకా శాలుంటాయి. ప్రస్తుతం డిస్కమ్ల మెడపై కత్తి వేలాడుతోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం. ఆ ఒ ప్పందాలు తెలంగాణకు గుదిబం డగా మారాయి.
వాళ్లు, వీళ్లు ప్రేమిం చుకున్నప్పుడు సంతకాలు పెట్టుకు న్నారు. అప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కనిపించలేదు. ఎన్ని కలు దగ్గరికి వచ్చినప్పుడు రైతులు ఉరి వేస్తారని వాస్తవాలు దాచిపె ట్టారని ఆక్షేపించారు. ఉదయ్ ఒప్పం దాన్ని డిస్కమ్లు అమలు చేయక తప్పని పరిస్థితిని కల్పించా రని మండిపడ్డారు. వినియోగదారు లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన అని వార్య పరిస్థితి వచ్చిందని, దీనికి బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పా లని డిమాండ్ చేశారు. లేకపోతే, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని, రేపు పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబ ర్లు కూడా కాలేరని వ్యాఖ్యానిం చారు. తెలంగాణ సమాజానికి ఈరోజు స్పష్టమైన వివరాలు ఇస్తున్నానని, మోదీతో (modi) ఆనాటి సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నది వాస్తవమని స్పష్టం చేశారు. అయినా.. హరీశ్ సభలో అబద్ధాలు చెబుతున్నారని, రికా ర్డుల నుంచి తొలగించాలని కోరా రు. సదరు ఒప్పందం కాపీలను హరీశ్కు ఇస్తామని చెబుతూ వాటిని పంపించారు. తలకిందు లుగా తపసు చేసినా రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)స్పష్టం చేశారు.