Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆక్రమణలను విడిచిపెట్టి వెళ్లాలని, లేదంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తా మని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ కు సీఎం హాజ రయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ఆక్ర మిస్తే చేరసాలే అన్నారు.ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్ రెగ్యులరైస్ స్కీం లేదన్నారు. ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులదేన న్నారు. సైనిక స్కూల్ (military school)తరహాలో పోలీసులకు 50ఎకరాల్లో పోలీసు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రక్షాళన చెయ్య డానికే కొత్తకోటకు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అప్పగించామన్నారు. పోలీసులంటే సమాజంలో చేతులె త్తి నమస్కరించాలన్నారు.
మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేనని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.కని పెంచిన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా యువత సక్రమమైన దారిలో నడవాలన్ని ఆకాంక్షించారు. ఉద్యోగాల కల్పన కు కాంగ్రెస్ (Congress) కట్టుబడి ఉందని, TGP SCలో అక్రమాలకు తావు లేకుండా ఆ సంస్థను ఇప్పటికే పూర్తిగా ప్రక్షా ళన చేశామని తెలిపారు. ఈ ఏడాదిలోనే మరో 35 వేల ఉద్యో గాల భర్తీ చేస్తామని అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెలవేరలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ పని తీరుపై యువకులకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని అన్నారు.కొందరు చెడు వ్యసనా లకు అలవాటు పడి డ్రగ్స్ను విచ్చ లవిడిగా సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో (Police Department)కొత్తగా చేరిన వా రు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యా ప్తంగా డ్రగ్స్, గంజాయి (Drugs, marijuana)వ్యసనాల కు స్థానం ఉండకుండా చేయాల న్నారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేశామని గుర్తు చేశారు.