Schools: పాఠశాలల పునః ప్రారంభం
రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారం భానికి రంగం సిద్ధం అయ్యింది. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవే టు, రెసిడెన్షియల్ వంటి అన్నిరకాల స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి.
వేసవి సెలవుల అనంతరం నేటినుంచి తరగతులు
ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు సిద్ధం
రూ.600 కోట్లతో స్కూళ్లలో మర మ్మతులు
అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు పూర్తి
ఇప్పటికే ప్రారంభమైన బడిబాట కార్యక్రమం
2024-25 అకాడమిక్ క్యాలెండర్ విడుదల డీఎస్సీ ద్వారా మూడు నెలల్లో టీచర్ల నియామకం
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారం భానికి(Re-opening of schools)రంగం సిద్ధం అయ్యింది. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవే టు, రెసిడెన్షియల్ వంటి అన్నిరకాల స్కూళ్లు తిరిగి తెరచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం(New academic year)ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించడానికి పుస్త కాలు, యూనిఫామ్లను(Uniforms)ఇప్పటికే సిద్ధం చేశారు.వీటితోపాటు అమ్మ ఆద ర్శ కమిటీల పర్యవేక్షణలో స్కూళ్లలో మరమ్మతు పనులు, ఇతర అవసరాల ఏర్పాట్లను పూర్తి చేశారు. స్కూళ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల్లో విద్యార్థుల తల్లిదం డ్రులతో పాటు గ్రూపుల సభ్యులు, టీచర్లు, ఇతర అధికారులు ఉన్నారు.
స్కూల్ పరిధిలో చేపట్టే ప్రతి పనినీఈ కమిటీల ద్వారానే నిర్వహిస్తున్నారు. స్కూళ్లలో మరమ్మతు పనులు, మంచినీటి సరఫరా, టాయిలెట్ల ఏర్పాటు వంటి పనులను ఈ కమిటీలే చూసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు రూ.600 కోట్లతో మరమ్మతు పనులను, మంచినీటి సరఫరా, టాయిలెట్ల ఏర్పాటు వంటి పనులను ఈ కమిటీలే చూసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు రూ.600 కోట్లతో మరమ్మతు పనులను పూర్తి చేశారు. ఇక ఈ విద్యా సంవత్స రానికి (2024-25) సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను(Academic calendar)కూడా విద్యాశాఖ ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 12 నుంచి 2025 ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాల లు కొనసాగుతాయి.
అక్టోబరు 13 నుంచి 25 వరకు 13 రోజులపాటు దసరా సెలవులు ఇస్తారు. డిసెంబ రు 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉంటా యి. ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి సిలబస్ ను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం రివిజన్ తరగతులు(Revision classes)నిర్వహించాలి. 1 నుంచి 9వ తరగతులకు సిలబ్ సను ఫిబ్రవరి 28వ తేదీలోపు పూర్తి చేయాలి. విద్యార్థులందరికీ రోజూ ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటే షన్ తరగతులు నిర్వహిస్తారు.
Schools reopen