Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటే కీలకం..!

తెలంగాణ లో ఇటివల ముగిసిన వరంగల్ – ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అభ్యర్థులందరికీ అందులోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు మానసిక ఒత్తిడి పెరిగిందని తెలుస్తుంది.

పట్టభద్రులు తమకే పట్టం కడతా రని ఎవరికి వారు గెలుపుపై ధీమా
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం ప్రకారం లెక్కల బేరీజు
గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ అగ్ర నేతలందరితో ప్రచారం
బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం
జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుతో తేలనున్న ఫలితం

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ(Telangana) లో ఇటివల ముగిసిన వరంగల్ – ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అభ్యర్థులందరికీ అందులోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు మానసిక ఒత్తిడి పెరిగిందని తెలుస్తుంది. ఊహించని విధంగా పోలింగ్(Polling) శాతం తగ్గడం అభ్యర్థులను కలవరపెడుతుందన్న ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటి ప్రాధా న్యంలో కోటా ఓటు ఎవరికీ రాదనే అంచనా వేసుకుంటున్న అభ్యర్థులు ద్వితీయ ప్రాధాన్య ఓటుతోనే ఫలి తం తేలుతుందని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.

ఈ నేప థ్యంలో గెలుపోటములో రెండో ప్రాధాన్యత ఓటే కీలకం కానుందా గత ఎన్నికల ఫలితాలను అభ్యర్థు లు విశ్లేషించు కుంటున్నారట. తె లంగాణలోని మూడు ఉమ్మడి జిల్లా ల్లో 32 మంది కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలు ఉండడంతో తన గెలుపు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ధీమాతో ఉండగా రెండో ప్రాధాన్యత ఓట్లతో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి(Anugula Rakesh Reddy) చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పట్టభ ద్రులు తమకే పట్టం కడతా రని, గెలుపు తమదేనని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగియగా ఎమ్మెల్సీ నియోజకవర్గ వ్యాప్తంగా 72.37 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రులు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కిం పు జరగనుంది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ఆసక్తి రేపుతోంది. జిల్లాల వారీగా నమోదై న పోలింగ్‌ శాతం ప్రకారం అభ్యర్థు లు లెక్కలను బేరీజు వేసుకుంటూ ఎక్కడ అనుకూలంగా ఉందనేది అనుచరులు, కార్యకర్తల ద్వారా తెలుసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీచేసినా, ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌), ఏనుగు రాకేశ్‌రె డ్డి (బీఆర్‌ఎస్‌), గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి (బీజేపీ) నడుమే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మ కంగా తీసుకుని సాధారణ ఎన్నికలను తలపిం చింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ అగ్ర నేతలందరినీ ప్రచారంలోకి దించి హోరాహోరీగా తలపడ్డాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్(Polling percentage)తగ్గింది. 2021 ఎన్నికల్లో 76.73శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 72.37 శాతం పోలింగ్ నమోదైంది. తగ్గిన పోలింగ్ శాతం లాభమా,నష్టమా, అనే దానిపై అభ్యర్థులు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు సాధారణ ఎన్నిక లకు భిన్నంగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కిం పు ఉంటుంది. పోలైన ఓట్లలో 50 శాతం దాటి ఒక్క ఓటు అదనంగా వస్తేనే విజేతగా ప్రకటిస్తారు. అయి తే ఈసారి మొదటి ప్రాధాన్యంలో గెలుపు కోటా ఓటు ఎవరికీ రాదనే అంచనా అభ్యర్థులు వేస్తున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓటుతో(Vote) ఫలి తం తేలదని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. గత మూడు సార్లు జరిగిన పట్టభద్రుల ఎన్నికల ఫలి తాలను పరిశీలిస్తే రెండో ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలింది. దీంతో ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటు తో గట్టెక్కే పరిస్థితి లేదని అభ్యర్థు లు భావిస్తున్నారు. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓటు కీలకం కానుందని అంతా అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ(Bjp) అభ్యర్థులు పట్టభద్ర ఓటర్లుకు సుపరిచితులే కావడంతో మొదటి ప్రాధాన్య ఓట్లు అధికంగా ఎవరికి పడ్డాయా, రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి వస్తాయనే దానిపై చర్చ సాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓటుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.మొదటి ప్రాధాన్యత ఓటు తో కోటా ఓటు రాకపోతే ఎలిమినేష న్ ప్రక్రియ ద్వారా చివరి అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లను బదలా యిస్తారు.

పోలైన ఓట్లతో సగాని కంటే ఒక ఓటు అదనంగా వచ్చే వరకు ప్రాధాన్యత ఓట్లను బద్దలా యిస్తుంటారు. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటు అభ్యర్థుల్లో టేన్షన్ పుట్టిస్తోంది. పట్టభద్రులు రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికి వేశా రోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఉప ఎన్నిక సమరం మాత్రం ప్రధాన పార్టీల మధ్యనే జరిగిందనేది చర్చ జరు గుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో వార్ వన్ సైడ్ ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతు న్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనిందనే చర్చ జరుగుతోంది. ద్వితీయ ప్రాధాన్య ఓట్లే ఈ ఎన్ని కల్లో(Election) అభ్యర్థుల గెలుపోట ములను ప్రభావితం చేసేలా ఉన్నాయి. దీంతో తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డిల మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే మూడు ఉమ్మడి జిల్లాల్లో ఒకే రీతిలో ఓటింగ్ జరగలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిల మధ్య మొద టి ప్రాధాన్యత ఓట్లు తేడా స్వల్పం గా ఉంటే రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో ప్రాధాన్యత ఓటు పైనే పడిందని తెలుస్తోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు(Independent candidates)కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల పొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నల్లగొండ, ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నకు(Tinmar mallanna) మొదటి ప్రాధాన్యత ఓటు భారీగానే వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగు తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ లకు మొదటి ప్రాధాన్య త ఓటు వేసే పట్టభద్రులందరూ ద్వితీయ ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి వేసే అవకాశం ఉందని రాజకీయం పరిశీలన భావిస్తు న్నారు.

దీంతో రెండో ప్రాధాన్యత కీలకంగా మారింది. పట్టబదుల రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారనేది ఇప్పుడు అభ్యర్థులను ఒత్తిడికి గురిచేస్తుంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలిపోతే మాత్రం అభ్యర్థు లు పెట్టుకున్న అంచనాలు తలకిం దులయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) మధ్య హోరాహోరిగా ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. కాగా
మూడు ఉమ్మడి జిల్లాల్లో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో తన గెలుపు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ధీమాతో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పట్ట భద్రులు తమకే పట్టం కడతారని, గెలుపు తమదేనని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు.

Second priority vote main role mlc elections