Secunderabad – Goa Train: ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రాబాద్ – గోవా (Secunderabad – Goa Train) వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ని భోయి గూడా వైపు గల పదో నెం బర్ ప్లాట్ ఫారం పై నుండి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు. తెలంగాణ రాజధానితో గోవా రాజ ధాని వాస్కో-డ-గామాతో మెరు గైన అనుసంధానం చేశారు. ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాలలో నడపబడుతోంది. ప్రస్తు తం కర్నాటక మరియు గోవా ప్రాం తాలకు వెళ్లేందుకు తెలుగు వారికి ప్రయాణ సౌలభ్యాలు తక్కువగా ఉన్నాయి.గోవా (gao) చేరుకోవడానికి గుంతకల్లు వద్ద ఉన్న ఇతర రైళ్లకు అనుసంధానించవలసిన లింక్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ రైలు అనుకూలమైన సమయాలతో సి కింద్రాబాద్ నుండి ప్రత్యేకమైన రై లు ప్రయాణ సౌకర్యాన్ని అంది స్తుంది.ఈ కొత్త రైలు దాదాపు 854 కి.మీల దూరాన్ని దాదాపు 20 గం టలపాటు ఎగువ దిశలో మరియు 21 గంటల పాటు దిగువ దిశలో ప్ర యాణం పూర్తిచేస్తుంది. ఈ రైలు మార్గంలో ప్రత్యేకమైన చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉ న్న ఇతర ముఖ్యమైన నగరాలను కలుపుతూ, నూతన ప్రాంతాల నుంచి పెరిగిన ప్రయాణికులతో నిర్ది ష్ట బంధాన్ని ఏర్పరుచు కోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ రైలు అ త్యాధునిక ఎల్.ఎచ్.బి. కోచ్లతో ప్రవేశపెట్టబడి ప్రయాణీకులకు సౌక ర్యవంతమైన ప్రయాణ అనుభూ తిని మరియు ఆధునిక సౌకర్యా లను అందిస్తుంది.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడా రు.కేంద్ర ప్రభుత్వం తరపున నవ రాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న ఈ బై-వీక్లీ రైలును ప్రారంభించుకుంటున్న సందర్భoగా శుభాకాంక్షలు తెలి పారు. ఈ రైలు తెలుగు రాష్ట్రా ల ప్రజలకు మరీ ముఖ్యంగా పర్యా టకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.ఇప్పటివరకు.. సికిం ద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు.. డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదు. వారానికి ఒక రైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిసి గోవాకు (gao) వెళ్లేది.దీంతోపాటుగా కాచిగూడ – యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపే వారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్ర యాణం సాగించేవారు.ఇలా సికిం ద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మం ది సీట్లు దొరక్క ఇబ్బందులు పడు తున్న విషయం నా దృష్టికొచ్చింది.
దీన్ని పరిష్కరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)ను అడగటం దీనికి వారు అంగీకరించి ఈ కొత్త రైలును ప్రకటించడం సంతోషకరం. వారికి ఈ సందర్బంగా ఈ వేదిక ద్వారా భారత ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నా ను.దాదాపు 20 గంటలపాటు సాగే ఈ ప్రయాణం తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మూడు రాష్ట్రాల పర్యాటక రంగాభివృద్ధికి, వాణిజ్య, సాంస్కృ తిక సంబంధాలు మరింత బలోపే తానికి కూడా సికింద్రాబాద్-గోవా ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగ పడుతుంది.ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడ గామా నుంచి గురువారం, శనివా రం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూ బ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరు కుంటుంది.
తెలంగాణలో రైల్వేల (railway) పురో గతి…తెలంగాణలో రైల్వేలకు సంబంధించి గత పదేళ్లలో.. చాలా సానుకూలమైన పని జరిగింది.
కొత్త రైల్వే లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి.మిగిలిన చోట్ల పనులు చాలా వేగంగా సాగుతున్నాయి.దక్షిణమధ్య రైల్వే రీజియన్లో దాదాపుగా ఎలక్ట్రిఫి కేషన్ (విద్యుదీకరణ) పూర్తయింది. వందకు పైగా రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం కల్పించాం సికింద్రాబాద్ (రూ.715 కోట్లు), కాచిగూడ (రూ. 425 కోట్లు), నాంపల్లి (రూ.429 కోట్లు) స్టేషన్ల ఆధునీకరణ, అత్యా ధునిక వసతులతో రూ. 415 కోట్లతో చర్లపల్లి టర్మినల్ అభివృద్ధి జరుగుతోంది.చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పూర్తవుతాయి.
40కి పైగా రైల్వే స్టేషన్లను (Railway stations) ఆధునిక వసతులతో (దాదాపు రూ.2,220 కోట్లు) తీర్చి దిద్దుతున్నాం.దేశవ్యాప్తంగా ఢిల్లీ తర్వాత అత్యధికంగా ఎక్కువగా (5) వందేభారత్ రైళ్లు మన సికిం ద్రాబాద్ నుంచి వెళ్తుండటం, తెలం గాణలో ప్రయాణికుల సౌకర్యానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్య తకు నిదర్శనం.ఈ వందేభారత్ రైళ్లు 100% ఆక్యుపెన్సీతో నడు స్తున్నాయి. ప్రజలనుంచి మంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇవే కాకుండా.. పలు కొత్త రైల్వే మార్గాలకు సర్వేకు కూడా మార్గం సుగమం అయింది. రూ.521 కోట్ల తో కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూని ట్ను కేంద్రం ఏర్పాటుచేయనుంది.దీనికి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.మొదట్లో దీన్ని పీరియాడిక్ ఓవర్ హాలింగ్ గానే అనుకున్నప్పటికీ మోదీ చొరవ తీసుకుని.. RMUగా అప్గ్రేడ్ చేయించారు.ఇక్కడ వ్యాగన్ల ఓవర్ హోలింగ్తో (With overholling) పాటుగా కోచెస్, ఇంజ న్స్ వ్యాగన్స్ తయారవుతాయి. దీని ద్వారా 3వేల మందికి ప్రత్య క్షంగా మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
100 రోజుల్లో తెలంగాణకు జరిగిన లాభం
గత పదేళ్లలో కేంద్రం తెలంగాణలో రైల్వేల (Center of Railways in Telangana) విస్తరణకు ప్రత్యేకంగా కృషి చేయడం, బడ్జెట్లో విశేషంగా కేటా యింపులు చేపట్టడంతోపాటుగా మూడోసారి అదికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనూ ప్రత్యే కంగా దృష్టి సారించింది.వివిధ రాష్ట్రాలలో 900 కిలోమీటర్లమేర రైల్ నెట్ వర్క్ ను విస్తరించేలా రూ. 24,600 కోట్ల విలువైన 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులు ప్రారంభించాం.ఇందులో తెలంగాణ నుంచి కూడా ఓ రైల్వే లైను (railway line) ఉంది. రూ. 4,109 కోట్ల అంచనా వ్యయం తో భద్రాచలం-మల్కాన్గిరి మధ్య 173 కి.మీ.ల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర పడింది.సికింద్రాబాద్ 5వ వందేభారత్ రైలును (నాగ్ఫూర్- సికింద్రాబాద్ మధ్యన) కూడా ఈ వందరోజుల ప్లాన్ లో భాగంగానే ప్రారంభించుకున్నాం. ఈ 100 రోజుల్లోనే తెలంగాణకు కేంద్రం మరో ఘనమైన కానుకను అందించింది.జహీరాబాద్ లో రూ. 2,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో పాటు లక్షా 74 వేల ఉద్యోగాల కల్పన ఈ ప్రాజెక్టుతో సాధ్యం కానుంది. హైదరాబాద్- నాగ్పూర్ మధ్య రూ.6,661 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థికాభి వృద్ధితోపాటుగా పెద్దమొత్తంలో ఉపాధి కల్పనకు బాటలు పడ తాయి.ఇలా గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలకు తోడుగా.. తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తం గా మౌలికవసతుల కల్పన, ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమ పథకా ల అమలు టార్గెట్ కగా మోదీ సర్కారు ముందుకెళ్తోందన్నారు.