Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Seed companies: విత్తన కంపెనీలు బాధ్యతతో పనిచేయాలి

విత్తన కంపెనీలు ప్రణాళిక ప్రకారం బాధ్య తతో ప్రత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5లోగా జిల్లాలకు చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశిం చారు.

జిల్లాలకు అవసరo మేరకు విత్తనాలు సరఫరా చేయాలి
యూనివర్సిటీ పరిశోధనల ప్రకా రం విత్తనాల సరఫరా చేయాలి
అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ప్రజా దీవెన,హైదరాబాద్: విత్తన కంపెనీలు ప్రణాళిక ప్రకారం బాధ్య తతో ప్రత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5లోగా జిల్లాలకు చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఆదేశిం చారు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీకి చెందిన ఒకే రకమైన విత్తనాలనే రైతులు కోరుతున్నారని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అలా కాకుండా యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని విత్తన హైబ్రిడ్ల(Seed hybrids)దిగుబడి ఒక్కటేనని ఈ విషయాన్ని రైతులందరికీ సంబం ధిత కంపెనీలు తెలియజేయాలని సూచించారు. ప్రతిరోజు జిల్లావారి, కంపెనీవారిగా ప్రత్తివిత్తన ప్యాకెట్ల పంపిణీ, కొనుగోలు వివరాలను పరిశీలిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రత్తి మరియు పచ్చి రొట్ట విత్తనాలు అవసరం మేరకు ఉన్నాయని తెలిపారు. రైతుల(Farmer) అవసరం మేరకు విత్తనాలను ప్రభుత్వ ఆమోదిత దుకాణాల నుంచి కొనాలని సూచించారు. రైతులు విత్తనాలకు సంబంధించి ప్రతి కొనుగోలు బిల్లులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్రస్థాయి అధికారుల తో వ్యవసాశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమీక్ష నిర్వహించారు. నకిలీవిత్తనాల విక్రే తలపై కఠిన చర్యలు తీసుకోవాల ని కలెక్టర్లు, పోలీసులకు మంత్రి ఆదే శాలు జారీ చేశారు. జిల్లాలకు వచ్చి న విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకో వాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశించారు.

సీడ్ కంపెనీ ప్రతినిధు లతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకు న్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ జిల్లాల వారిగా నేటికి 68,16,967 వివిధ కంపెనీల ప్రత్తివిత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5వ తేదీలోగా జిల్లాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతుల అవసరం మేరకు ప్రత్తి, జిలుగ విత్తనాలు(Groundnut seeds)పంపిణీ చేసినట్లు వివరించారు. విత్తనాలను జిల్లా కలెక్టర్లు రైతులకు సక్రమంగా చేరేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా ఎక్కడైనా రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో వస్తే కౌంటరులు ఎక్కువ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇకనుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రతినిత్యం పర్యటిస్తూ విత్తనాల విక్రయ కేంద్రాలు,(Seed sales centres)జిలుగ, జనుము సరఫరా చేసే కేంద్రాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Seed companies work with responsibly