Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme Court: సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డు వివాదం

Supreme Court: ప్రజా దీవెన, హైదరాబాద్:తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకు ముదురుతుంది. నెయ్యి కల్తీ, విశ్వాసానికి (Adulteration of ghee, to faith) ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియో గాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తోపాటు అటు దేశవ్యా ప్తంగా దుమారం రేపుతు న్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ రాజకీయ నేతలు, ఆధ్యాత్మికవేత్తలు, పలువురు ప్ర ముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తే ల్చేందుకు, సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభు త్వం కూడా ప్రకటించింది.ఈ క్రమం లోనే తిరుమల లడ్డూ వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరిం ది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టుకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.

BJP నేత సుబ్రహ్మణ్య స్వామి, YCP నేత వైవీ సబ్బారెడ్డి సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించారు.తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్య లపై విచారణ చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశా రు.ఆధారాలు లేకుండా ఆరోపణ లు చేశారని, సుప్రీంకోర్టు పర్య వేక్షణలో దీనిపై విచారణ జరగా లని కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సు ప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిల్‌ దాఖలు చేశారు.తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారంలో విచారణ కోరుతూ వైసీపీ నేత వైవీ సు బ్బారెడ్డి సైతం సుప్రీం కోర్టులో పిటి షన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచా రణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ పిటీషన్ ను స్వీకరించి న ఏపీ హైకోర్టు విచారణ చేపట్ట నుంది.