Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana song: జూన్ 2న జాతికి అంకితం తెలంగాణ గీతం సిద్ధం

ప్రతిష్టా త్మకమైన తెలంగాణ గీతంపై తుది నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరుస భేటిలతో కేబినేట్ భేటీ లో ఫైనల్ చేసి ఆమో దం తెలిపారు.

మూడు చరణాలతో కూడిన2:30 నిమిషాల నిడివి గల వెర్షన్‌ ఆవిష్కరణ
మరో వెర్షన్ లో 13:30 నిమిషాల నిడివితో పరిపూర్ణమైన గీతం
రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామన్న ప్రభుత్వం
క్యాబినెట్‌ నిర్ణయంతోనే లోతైన కసరత్తులో తెలంగాణ తల్లివిగ్రహం, రాష్ట్ర చిహ్నం
జూన్‌ 2న రెండు పూటలా ఆవి ర్భావ దినోత్సవ వేడుకలు
అట్టహాసంగా నిర్వహించే ఈ వేడు కల్లో పాల్గొననున్న సోనియా, రా హుల్‌, వీలైతే ప్రియాంక గాంధీ

ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రతిష్టా త్మకమైన తెలంగాణ గీతంపై తుది నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరుస భేటిలతో కేబినేట్ భేటీ లో ఫైనల్ చేసి ఆమో దం తెలిపారు. ప్రముఖ గేయ రచ యిత అందెశ్రీ(Andeshri) రచించిన సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరచిన జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినో త్సవం వేడుకల్లో జాతికి అంకితం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)

నేతృ త్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం*
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక, వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జన జాతర
అను నిత్యము నా గానం… అమ్మా నీవే మా ప్రాణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
గోదావరి, కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్‌ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగా ణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్క రించనున్నారు. 10:35 గంటలకు ప్రారంభించి 10:37:30 సెకన్ల వర కూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. అదే సందర్భంలో 13:30 నిమిషాల నిడివిగల మరో వెర్షన్ పూర్తి గీతా న్ని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ఈ వేడుకల్లో పాల్గొ ననున్నారు. రాష్ట్ర గీతం ఆవిష్క రణ అనంతరం ఐదు నిమిషాల పాటు ఆమె ప్రసంగించనున్నారు.

సోనియాతో(Sonia)పాటు రాహుల్‌, ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే జూన్‌ 2న ఉదయమే కాక సాయం త్రం కూడా రెండు పూటలు పలు కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిం చింది. ఆరోజు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్‌ అమర వీరులకునివాళులర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ సాయంత్రం ట్యాంక్‌బండ్‌ వద్ద కార్నివాల్‌తో వేడుకలు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగియనున్నా యి. సాయంత్రం 6:30 గంటలకు సీఎం రేవంత్‌ ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు.

అనం తరం దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శన లు జరుగుతాయి. ఆ తర్వాత జాతీ య జెండాలతో ట్యాంక్‌బండ్‌పై దాదాపు 5వేల మంది భారీ ఫ్లాగ్‌ వాక్‌ నిర్వహించనున్నారు. ఈ ఫ్లాగ్‌ వాక్‌ జరుగుతున్న సమయంలో 13:30 నిమిషాల నిడివితో ఉన్న ‘‘జయ జయహే తెలంగాణ’’(Jaya Jaya Telangana) గీతా న్ని ఆవిష్కరించనున్నారు. రాత్రి 8:50 గంటల నుంచి 9 గంటల దాకా అంటే పది నిమిషాల పాటు చుట్టుపక్కల లైట్లన్నీ ఆఫ్‌ చేసేసి బాణసంచా కాలుస్తారు. దీంతో వేడుకలు ముగుస్తాయి. తదనంత రం రాష్ట్ర గీతాన్ని రచించిన కవి, రచయిత అందెశ్రీని దానికి స్వర కల్పన చేసిన సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిని రాత్రి 8:44 నుంచి 8:50 గంటల మధ్య ప్రభుత్వం సన్మానించనుంది.

ఇదిలా వుండగా రాష్ట్రావిర్భావ దశాబ్ది వేడుకలు, రాష్ట్ర గీతం తదిరత అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి,(Gutta Sukhender Reddy)మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌, జూపల్లి, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్‌ కోదండ రాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు ఎం.ఎం కీరవాణి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో(MLA)పాటు తెలంగాణ బిల్లు ఆమోదిం చిన సమయంలో లోక్‌సభలో ఉన్న అప్పటి ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వ హణపై చర్చించారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు పూర్తవు తున్న సందర్భంగా దశాబ్ది ముగిం పు వేడుకలను ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఆ వేడుకల్లోనే రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగా ణ’ను జాతికి అంకితం చేస్తామ న్నారు. ఉద్యమకాలంలో అందరినీ ఉర్రూతలూగించి, తెలంగాణ ఖ్యా తిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తు లో తరతరాలు పాడుకునేలా అంద రి ఆమోదంతో, క్యాబినెట్‌లో తీసు కున్న నిర్ణయం మేరకే రాష్ట్రగీతంగా ఆమోదించామని సీఎం తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన ఈ గీతాన్ని యధాతథంగా ఉంచామని స్పష్టం చేశారు.

అయితే ఈ గీతాన్ని రెండు న్నర నిమిషాలు, 13:30 నిమిషాల నిడివితో రెండు వెర్షన్లలో రూపొం దించామని వీటిలో మూడు చరణా లతో కూడిన రెండున్నర నిమిషాల గేయం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆల పించేందుకు వీలుగా ఉంటుందని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేప ట్టిందని వాహనాల రిజిస్ట్రేషన్‌(Registration) నంబర్లతోపాటు అన్ని ప్రభుత్వ సంస్థలనూ ‘టీజీ’గా మార్చామని సీఎం గుర్తుచేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నాం, తెలం గాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నామని తెలి పారు. అదే సందర్భంలో తెలంగాణ(Telangana) రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడిందని ఈ చిహ్నం తుది రూపు సంతరించుకుని అందరి ఆమోదం పొందితే జూన్‌ 2నాడే విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది.

అయితే తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నాలకు సంబం ధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి తమకు 500 నమూనాలు వచ్చాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. వాటిపై చర్చలు జరుగుతున్నాయని చిహ్నానికి సంబంధించి ఇంకా తుది రూపమేదీ ఖరారు కాలేదని స్పష్టం చేశారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపో హాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణ యం తీసుకుంటామన్నారు. అందరి కీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉం టుందన్నారు.

Telangana song dedicated People