Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tirupati Reddy: సీఎం రేవంత్ సోదరునికి హైడ్రా నోటిసులు

–సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు

Tirupati Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తనపర భేదం లేకుండా ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతామని చెప్పింది చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddyముందుకు సాగు తున్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదని ఎంతటి వారినైనా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తాను చెరువుల పరిరక్షణకు పాటు అన్నట్టు పలుమార్లు స్పష్టం చేసిన సీఎం తాజా సంఘటనతో అది నిజమని నిరూపించుకుంటున్నాడు. చెరు వుల కబ్జాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ (Focus of Telangana Sarkar) పెట్టిన నేపధ్యంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుం ది. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తి రుపతి రెడ్డి (Tirupati Reddy)ఉంటున్న ఇంటికి నోటీ సులు అందించింది.

మాదాపూర్‌ అమర్‌ కో-ఆపరేటివ్ సోసైటీలో (Amer Co-operative Society) తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇం టికి, కార్యాలయానికి నోటీసులు అందించారు జి హెచ్ ఎం సి అధి కారులు ఆయన ఉంటున్న ఇల్లు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారుల గుర్తిం చారు.కట్టడాలను తొలగించాలని 30 రోజుల గడువు ఇచ్చారు అధికా రులు.దుర్గం చెరువుకు ఆనుకున్న ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరిహిల్స్, అమర్ సోసైటీవా సులకు (Nectar’s Colony, Doctors Colony, Cauvery Hills, Amar Societiva Sula) కూడా నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 ఇళ్లకు జీహెచ్‌ఎంసీ అధికారుల నోటీసులు ఇచ్చారు.

పలువురు ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ ప్రముఖులకు (For IAS, IRS officers, film and political celebrities)నోటీసులు ఇచ్చారు. మరోవైపు కూల్చివేతలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశా రు. తన కుటుంబ సభ్యులకు ఆక్ర మణలున్నాయని, ఎవరైనా ఆధా రాలు చూపిస్తే వాటినీ కూల్చివేస్తాం అని ఆయన అన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు.