–నూతన పాలకవర్గాన్ని నియమి స్తు ప్రభుత్వం ఉత్తర్వులు
Tummala Nageswara Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో మరో దఫా నాలు గు వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా గా మరో నాలుగు అగ్రిక ల్చర్ మార్కెట్ కమిటీలకు (Agriculture Market Committees) చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లను మరియు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. దీంతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 75 అగ్రిక ల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరి గిందన్నారు. ఈ సందర్భంగా మం త్రి నూతనంగా ఎన్నికైనా పాలక వర్గ సభ్యులకు (members of the ruling class) అభినందనలు తెలియచేశారు.
జగిత్యాల జిల్లా మల్లియల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (Mallial Agriculture Market Committee)కి చైర్మన్ గా బత్తిని మల్లే శ్వరి, వైస్ చైర్మన్ గా కేతిరెడ్డి జీవ న్ రెడ్డి, నల్లగొండ జిల్లా వెంక టేశ్వ ర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దొంతం అలివేలు , వైస్ చైర్మన్ గా నక్క శ్రీను, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నా యిని జమునా రెడ్డి, వైస్ చైర్మన్ గా తగుళ్ల సర్వయ్య లతో పాటు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మంథూర్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా వినయ్ కుమార్ లను ప్రభుత్వం నూతన పాలక వర్గా లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.