Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకవ్యక్తి న్యాయ కమిషన్

–కమిషన్ నియామకంలో అడ్వ కేట్ జెనరల్ సూచనలు తప్పనిసరి
–రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘము సిఫార్సు
–యుద్దప్రాతిపదికన బిసి సామా జిక ఆర్థిక కులగణన,బి.సి ఓటర్ల గణనకు తీర్మానం
–పంజాబ్,తమిళనాడులలో అధ్య యనం చేసిన అధికారుల బృందం
–మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్య క్షతన మంత్రివర్గ ఉప సంఘం భేటి
–హాజరైన మంత్రులు దామోదర్ రాజనరసింహా,దుద్దిళ్ల శ్రీధర్ బా బు,సీతక్క, పొన్నం ప్రభాకర్ లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శాంతికుమారి,అడ్వకేట్ జెనరల్ సుదర్శన్ రెడ్డి,బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమ లుకై ఏకావ్యక్తి కమిషన్ ఏర్పాటు చెయ్యాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిం ది.కమిషన్ నియామకంలో అడ్వ కేట్ జెనరల్ సూచనలను పరిగణ నలోకి తీసుకోవాలని ఉపసంఘ ము తీర్మానించింది.అంతే గాకుం డా ఏకవ్యక్తి కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమి షన్ సిఫారసులను అమలులోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కు లు ఎదురుకాకుండా ఉండేలా ని యామకం జరిగేలా చూడాలని ఉపసంఘము ఏకాభిప్రాయం వ్య క్తం చేసింది.సుప్రీంకోర్టు తీర్పు(Supreme Court verdict) మేర కు తెలంగాణా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర నీటిపా రుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్,దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,లోకసభ స భ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియ మించిన విషయం విదితమే.

ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి (Uttam Kumar Reddy)అధ్యక్షతన మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ తెలం గాణా సచివాలయంలో నాలుగో సారీ మంత్రివర్గ ఉప సంఘం సమా వేశం అయ్యింది.మంత్రులు దామో దర్ రాజనరసింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ ,సితక్క లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతాకుమా రి ,అడ్వకేట్ జెనరల్ సుదర్శన్ రెడ్డి,బి.సి కమిష న్ చైర్మన్ నిరంజన్,లా సెక్రటరీ తిరుపతి తదితరులు ఈ సమావే శానికి హాజరయ్యారు.రాష్ట్ర ప్రభు త్వ యస్.సి అభివృద్ధి శాఖా ప్రత్యే క కార్యదర్శి శ్రీధర్, ఐ.ఏ.యస్ అధికారులు బుర్రా వెంకటే శం,లోకేష్ కుమార్, దానకి శోర్,టి.కే.శ్రీదేవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు,పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసింద న్నారు.2011 జనాభా లెక్కల ప్రాతి పదికన ఉపకులాల వర్గీకరణ ఉంటుందని అందుకు సంబంధిం చిన పూర్తి సమాచారం ఉద్యగ నియామకలతో సహా నివేదికను రూపొందించాలని ఆయన అధి కారులను ఆదేశించారు.ఎస్సీ వర్గీక రణ పై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా పర్యటించ నున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి సితక్క( Minister Sitakka)మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని టైంబౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చెయ్యా లన్నారు.అదే విదంగా యు ద్ధప్రాతిపదికన బిసిల సాంఘిక ఆర్డిక గణన చేపట్టాలని సూ చించారు.అందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యలన్నారు.