–అక్రిడిటేషన్ కార్డులు పెంచేందుకు కృషి
–టియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్య క్షుడు విరహత్ అలీ
Virhat Ali: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలోని చిన్న, మధ్య తరహా పత్రికలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటామని టియూ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహ త్ అలీ (Virhat Ali) అన్నారు. శుక్రవారం యూ నియన్ కార్యాలయంలో చిన్న పత్రి కల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో వినతి పత్రాన్ని అందజే శారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ కార్డులు, పత్రికల అఫ్ గ్రేడ్ విషయంలో ఎదుర్కొంటున్న ఆయా సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ చైర్మన్, అక్రిడి టేషన్ మార్గనిర్దేశాల ప్రత్యేక కమిటి చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి (K. Srinivas Reddy) దృష్టికి తీసు కెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా మన్నారు.
2018 నుంచి అఫ్ గ్రేడ్ పెండింగ్ (Off grade pending)ఉన్న విషయంతో పాటు అక్రిడిటేశన్ కార్డులను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డుల విష యంలోనూ చిన్న పత్రికలకు సము చిత స్థానం ఉంటుందన్నారు. టి యూడబ్ల్యూజే( ఐజేయూ)కు అను బంధంగా ఉన్న తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ కు ఆయా జిల్లాల్లోని మీడియా అక్రిడిటేషన్ కమిటీల్లోనూ (Accreditation Committee) సభ్యులుగా ఉంటారన్నారు. పదేళ్లుగా చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న ఆయా సమస్యల పట్ల తమకు అవగాహాన ఉందని, పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ సందర్బంగా నల్ల గొండ జిల్లా చిన్న పత్రికల సంఘం నేతలను అభినందించారు.
ఐక్యం గా ఉండి సమస్యలను పరిష్కరిం చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ (Newspapers and Magazines Association) రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బా బు, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి, యూని యన్ నాయకులు బొమ్మపాల వెంకటయ్య, షేక్ అహ్మద్ అలీ, కొమర్రాజు శ్రీనివాసులు, మక్సుద్ అహ్మద్, కోటగిరి చంద్రశేఖర్ తది తరులు పాల్గొన్నారు.