ప్రజా దీవెన, హైదరాబాద్: భార్యాభర్తల సంబంధం రోజు రోజుకు దిగజారిపోతుంది. కల కాలం కలిసుండాల్సిన దంప తులు మధ్యలో పెడదారిన పడుతున్నా రు. దీంతో కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోతుంది. క్షణిక సు ఖం కొందరు అడ్డదారులు తొక్కి మధ్యలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వివాహిత యువకుడితో అక్రమ సం బంధం పెట్టుకుంది. ఏకాంతం గా ఉన్న సమయంలో భర్త కంట్లో పడ్డారు.
దీంతో కోపోద్రేకుడైన భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దా రుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ వివాహిత కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె 21 ఏళ్ల యువకుడైన రితిక్ వర్మతో వివాహే తర సంబంధం పెట్టుకుంది. అయి తే సోమవారం ఉదయం 11 గంట ల ప్రాంతంలో వివాహిత యువకు డితో ఏకాంతంగా ఉంది. అదే సమ యంలో భర్త ఇంటికొచ్చాడు.
దీంతో ఇద్దరిని రెడ్హ్యాండెడ్ పట్టుకున్నా డు. ఈ పరిణామంతో భర్త కోపం తో రగిలిపోయాడు. మరికొందరి సాయంతో యువకుడిని తీవ్ర చిత్ర హింసలకు గురిచేశాడు. అతడి గోళ్లు కూడా పీకేశారు. రితిక్ వర్మ తో పాటు వివాహితను కూడా దా రుణంగా కొట్టారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో రితిక్ వర్మ ప్రాణాలు కోల్పోయాడు.