TDPNaraLokesh : ప్రజా దీవెన, కడప: వైసిపి విధ్వంస పాల నలో రాష్ట్రం తీవ్రంగా నష్టపో యింది, దేశానికే అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చే శారు, ఒక్క కొత్త కంపెనీ రాకపో గా ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాల కు పారిపోయాయి, అంతులేని ధన దాహంతో విషం కంటే ప్రమాదకర మైన మద్యాన్ని ఏరులై పారించి 30వేలమంది అమాయకుల ప్రాణా లను బలిగొన్నారు, వేలకోట్లు దోచు కొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్లి పోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. కడప మహానా డు వేదికపైనుంచి లక్షలాదిగా తర లివచ్చిన కార్యకర్తలనుద్దేశించి యు వనేత లోకేష్ మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే…
మనకి అధికారం కొత్త కాదు , ప్రతిప క్షం కొత్త కాదు. కానీ 2019 నుండి 2024 వరకూ విధ్వంస పాలన ఎ దు ర్కొన్నాం. ప్రశ్నిస్తే కేసులు, పోరా డితే అరెస్ట్. మన అధినేతను అక్ర మంగా అరెస్ట్ చేసి 53 రోజులు జై ల్లో పెట్టారు. నాయకులు, కార్యకర్త ల పై వేల కేసులు, అరెస్టులు జరిగా యి. నాయకులు, కార్యకర్తలపై దా డులు చేసారు, హత్యలు చేసారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రత్యర్ధు లు దాడి చేస్తున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత మన ద మ్ము. గొడ్డలి తో దాడి చేసినా, కత్తు లదాడిచేసి తల నుండి రక్తం కారు తున్నా ఈవిఎం మెషిన్కు సీల్ వేసే వరకూ పోలింగ్ బూత్ లో కూర్చు న్న మంజులా రెడ్డి మన ధైర్యం. కత్తి మెడ పై పెట్టి వాళ్ళ నా యకుడి కి జై కొట్టమంటే జై చంద్ర బాబు జై టిడిపి అన్న చంద్రయ్య మన స్ఫూ ర్తి. అరాచకులపై పోరాడి కంటిచూ పు కోల్పోయిన చెన్ను పాటి గాంధీ నే మనకు ప్రేరణ. ప్రాణాలను ఫణం గా పోరాడే పసుపు సైన్యమే మనబ లం.
తిరుమల తొలిగడప దేవుని కడప, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆ లయం, అమీన్ పీర్ దర్గా, మరియా పురం చర్చి నెలకొన్న పుణ్యభూమి కడప. పౌరుషం, ఆత్మీయతలను కలగలిపి మహిళలను గౌరవించి గొప్పనేల కడప. కడప మాస్ జాత ర మహానాడు అదిరిపోయిం ది. పౌ రుషాల గడ్డపై పసుపు సైన్యం గర్జిం చింది, దేవుని గడప కడపలో పసు పు పండగ జరుపుకోవడం మన అ దృష్టం. 2024లో మాస్ విక్టరీ సా ధించాం, రికార్డులు బద్దలు కొట్టాం చరిత్రను తిరగరాసాం. 94 పర్సెం ట్ స్ట్రైక్ రేట్…164 అవుటాఫ్ 175. ఇది కేవలం రికార్డ్ కాదు ఆల్ టైం రికార్డ్. ఇది తెలుగుదేశం పార్టీ కార్య కర్తల నాటుదెబ్బ. జెండా పీకేస్తాం అన్నారు … పార్టీ కార్యాలయానికి టు లెట్ బోర్డు పెట్టుకున్నారు. పార్టీ లేకుండా చేస్తామన్నోళ్లు అడ్రెస్స్ లేకుండా పోయారు. వై నాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేసారు… ఎన్నికల్లో ప్రజలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఏ తప్పు చేయని మన అధినేతను అరెస్ట్ చేసారు…
ఆరుశాసనాలే మన శ్వాస…సమాజమే దేవాలయం, ప్రజలే దేవు ళ్లు అన్నారు అన్న ఎన్టీఆర్. అందుకే మనం ఆరుశాసనాలు తీ సు కున్నాం. కడప మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆరుశాస నాలను పొలిట్ బ్యూరో సభ్యుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు శ్వాసగా భావించి చిత్తశుద్ధితో అమలుకు కృషిచేయాలి. తెలుగు జాతి – విశ్వఖ్యాతి, పేదలసేవలో – రీఇంజనీరింగ్, స్త్రీశక్తి,, యువ గళం, అన్నదాతకు అండగ, కార్యకర్తే అధినేత. మనకు రాష్ట్రప్రజ లు, ప్రజల ముఖాల్లో చిరునవ్వు, వారి సంతోషమే ముఖ్యం. ఇం దుకోసం అహర్నిశలు కష్టపడి ప్రజల మనసు గెలుద్దాం. సమస్య లుంటే ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి. స్థానికంగా సాధ్యం కాకపోతే మా దృష్టికి తీసుకువస్తే మేమే పరిష్క రించేం దుకు సిద్ధంగా ఉన్నాం. రాజ మండ్రి జైలులో చంద్రబాబును చూసి నపుడు చాలా బాధేసింది. అలిపిరిలో ఆయనను చంపేందుకు బా బు పేల్చారు. ప్రజలకు అండగా నిలచేందుకు భగవంతుడు ఆయన ను ఈనాడు మన ముందుంచారు.
చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్…తెలుగు వారిని ప్రపంచ పటంలో పెట్టింది మన బ్రాండ్ సిబి ఎన్. అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ. అప్పు డు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరా బాద్ ఇప్పుడు అమరావతి. అప్పు డు రూ.200 పెన్షన్ ను రూ. రెండు వేలు చేసింది మన సిబిఎన్ ఇప్పు డు పెన్షన్ ను రూ.నాలుగు వేలు చే సింది మన సిబిఎన్. అన్న క్యాంటి న్లు, డ్వాక్రా, దీపం, పేదల చిరున వ్వు మన సిబిఎన్. సిబిఎన్ అంటే డెవెలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షే మం, సిబిఎన్ అంటే మానవత్వం. మన నాయకులు ట్రెండ్ ఫాలో అ వ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయనే లెజెండ్. ఎన్టీఆర్ అంటే మూ డు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆ యనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కర్ణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవు డు.
దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్…పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం లోకి రావడం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం, అభివృద్ధి పరిచయం చే సింది ఎన్టీఆర్. రూ.2 కే కిలో బి య్యం, పెన్షన్, రూ.50 కే హార్స్ పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజన పధకం, మహి ళలకు ఆస్తిలో సమాన హక్కు, పటే ల్ పట్వారి విధానం రద్దు, సాగునీ టి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు, మహిళ లకు రిజర్వేషన్లు. అభివృద్ధి అయి నా, సంక్షేమం అయినా ఎన్టీఆర్ ఒక బ్రాండ్.
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే కూటమి ఏర్పాటు…రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కూట మి ఏర్పడింది. ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు, జనసేన అధి నేత పవనన్న, మన చంద్రన్న జెం డాలు, ఎజెండాలు పక్కన పెట్టి కలి సి పనిచేసారు. ప్రజలు కూటమిని ఆశీర్వదించారు. ప్రజా ప్రభుత్వం ఏ ర్పడింది. ఎన్ని ఆ ర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధి కా ర్య క్రమాలు అమ లు చేస్తున్నాం. దేశం లో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తున్నాం. పూర్తి గా బెడ్ కే పరిమితం అయిన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. నేను ఈ వేదిక మీద నుండి వైసిపి వాళ్ళ ను ప్రశ్నిస్తున్నా వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి మీకు ఎన్ని ఏ ళ్ళు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. దీ పం పథకం లో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్న క్యాం టీన్లు తెరిచాం. పేద వాళ్లు కడుపు నిండా భోజనం చేయడం కూడా జ గన్ మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉం డదు అందుకే అప్పుడు అన్న క్యాం టిన్లు మూసేసారు.
త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ…త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఇస్తాం. ఆగస్టు 15 నుండి మ హిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తాం. 16,347 పోస్టులతో మెగా డీఎస్సి నిర్వహిస్తు న్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తున్నాం. రాయలసీమను ఆ టోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రెన్యూ వ బుల్ ఎనర్జీ, హార్టీ కల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. ప్రకాశం జిల్లా లో రిలయన్స్ సిబిజి ప్లాంట్లు, ఉభ య గోదావరి జిల్లాల్లో ఆక్వా అభి వృద్ధిచేస్తున్నాం. ఉత్తరాంధ్ర లో ఐ టీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ త యారీ, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాం ట్ రాబోతున్నాయి. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇప్పటికే రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడి వాటి ద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పం దాలు చేసుకున్నాం. యువ గళం పాదయాత్ర సమయంలో రాయల సీమ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశాక ఈ కడపగడ్డపైనే మిషన్ రాయలసీమ ప్రకటిం చా. అప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశ గా చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులం తా కూటమికి సహకరించారు. వారి సమ స్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తాం.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత…తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం టీడీపీ కార్యకర్తలకు ఇస్తుం ది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కోటి మంది సభ్యులు లేరు. సభ్య త్వం లో కూడా మన రికార్డులు ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేరు. 5 లక్షల ప్రమాద భీమా అందిస్తుంది ఒక్క టీడీపీ మాత్రమే. ఫ్యాక్షన్ లో చని పోయిన కార్యకర్తలు పిల్లలు ఫ్యాక్ష న్ వైపు వెళ్ళకూడదని ఎన్టీఆర్ మో డల్ స్కూల్ ఏర్పాటు చేసి చదివిం చింది మన సిబిఎన్. విద్య, వై ద్యం, స్వయం ఉపాధి ఇలా రూ. 140 కోట్లు కేవలం కార్యకర్తల సం క్షేమం కోసం ఖర్చు చేసింది టిడిపి. నేను స్వయంగా వైసిపి బాధిత కా ర్యకర్తల కుటుంబాలను కలుస్తు న్నాను. వారి సమస్యలను ఒక్కొ క్కటిగా పరిష్కరిస్తున్నా. వారికి పార్టీ అండగా ఉంటుంది.
పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం…నామినేటెడ్ పదవులు అన్ని ఒక్క పద్ధతి ప్రకారం ఇస్తున్నాం. మన అధినేత చంద్రబాబు గారు, నేను ఏ ప్రభుత్వ కార్యక్రమం పెట్టుకొని జి ల్లాలకు వచ్చినా ఇచ్చిన మాట ప్ర కారం ముందు ఉత్తమ కార్యకర్త లు, ఆ తరువాత కార్యకర్తలను కలి సిన తరువాతే ప్రభుత్వ కార్యక్రమా లు పెట్టుకుంటున్నాం. నేను సీని యర్ల ను, జూనియర్స్ ను గౌరవిస్తా ను. కానీ పనిచేసేవారినే ప్రోత్సహి స్తా. ప్రతి కార్యక్రమం లో కార్యకర్త లు భాగస్వామ్యం అవ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాల గురించి ప్రజల్లో చర్చ చె య్యాలి. అధికారంలో ఉన్నప్పుడు కాదు… ప్రతిపక్షంలోనూ జగన్ ను వాళ్ళ నాయకులు, కార్యకర్తలు కలవలేరు. కార్యకర్తల కోసం మా ఇంటి ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. నో.. డోర్స్ క్లోజ్డ్. అది వైసిపి కి టిడిపి కి తేడా.
రాష్ట్రం కోసం కలిసే ముందుకు సాగుతాం...ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమం త్రి పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రా న్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నా రు. ప్రధాని మోడీ మన రాష్ట్రా నికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనం అడిగిన ప్రతి కోరిక తీరు స్తు న్నారు. మనకు అహంకారం ఉండ కూడదు, అహంకారం విర్రవీగిన గ త పాలకుల 151 సీట్లు 11 అ య్యాయి. అందుకే నేల మీద ఉం డి ప్రజలకు సేవ చెయ్యాలి. అధికా రంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పనిచేయాలి. చిన్న కుటుంబంలోనే సమ స్యలు ఉంటాయి. కూటమి అ న్న తరువాత చిన్న చిన్న సమస్య లు ఉండటం సహజం. ఇగో లు ప క్కన పెట్టి అందరిని కలుపుకొని ప నిచేయాలి. రాసిపెట్టుకోండి విడాకు లు ఉండవు. రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే మనం కలిసి ఉండాల్సిందే.
ప్రభుత్వ కొనసాగింపుతోనే ప్రగతి… మహానాడు వేదికగా నే ను ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని అనుకుం టు న్నాను. గవర్నమెంట్ కంటిన్యు టీ, ప్రభుత్వ కొనసాగింపు కొనసా గింపు ముఖ్యం. ఒక రాష్ట్రం అభి వృద్ధి చెందాలి అంటే ప్రభుత్వ కొ నసాగింపు చాలా ముఖ్యం. కట్టుబ ట్టలతో బయటకు వచ్చి 14 నుండి 19 వరకూ రాష్ట్రాన్ని అభివృద్ధి చే సుకున్నాం. 2019లో ప్రభుత్వం మా రడంవల్ల, ఒక సైకో ముఖ్యమం త్రి వల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్ట పోయి 30 ఏళ్ళు వెనక్కి పోయింది. అదే 19- 24 వరకూ మన ప్రభు త్వం కొనసాగి ఉంటే ఎటువంటి అ భివృద్ధి జరిగేదో ఒక్కసారి ప్రజలం తా ఆలోచించాలి. గుజరాత్ లో బీజేపీ వరుసగా 7 సార్లు గెలిచింది. ఒకే ప్రభుత్వం ఉండటం వలన గు జరాత్ ఎలా అభివృద్ధి చెందిందో చూడండి.
ఒడిశాలో బిజూ జనతా దళ్ వరుసగా ఐదు సార్లు గెలిచిం ది. ఆ రాష్ట్రం అనేక రంగాల్లో అభి వృద్ధి చెందింది. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి చంద్రబాబు నేతృత్వంలో ఒకసారి వరుసగా రెండుసార్లు విజ యం సాధించాక ఎంతటి అభివృద్ధి సాధించిందో మీకందరికీ తెలుసు. అందుకే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా ముఖ్యం. దీని గురిం చి రాష్ట్రవ్యాప్త చర్చజరగాలి. ప్రభు త్వ కొనసాగింపు ఉంటే పెట్టుబడి పెట్టే వారికి నమ్మకం ఉంటుంది. మ న యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
రెడ్ బుక్ అంటే ఏమిటో అర్థ మైందా రాజా...రెడ్ బుక్ పేరుచె ప్పగానే ఒకడికి గుండెపోటు వచ్చిం ది, మరొకడు బాత్రూమ్ లో కాలిజా రిపడ్డాడు, ఇంకొకడు ఏమయ్యాడో మీరందరికీ తెలుసు, అర్థమైందా రా జా? రెడ్ బుక్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అ మలుచేయడమే. అంతా రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఏడుస్తున్నారు. ఎవ రైతే చట్టాలను ఉల్లఘించి ప్రజల ను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం అని చెప్పాను. ఇప్పుడు రెడ్ బుక్ అదే చేస్తుంది. రెడ్ బుక్ కాదు రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లే దు. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసి న తప్పులను ఎస్టాబ్లిష్ చెయ్యాలి. దానికి సమయం పట్టొచ్చు. కానీ శిక్ష తప్పదు.
ఎవ్వరూ తప్పించుకోలే రు. రెడ్ బుక్ తన పని తాను చేసు కుంటూ వెళ్తుంది. ఇప్పుడు మనం అంతా డెవెలప్మెంట్ బుక్ మీద దృ ష్టి పెట్టాలి. మనకి ప్రజలు ముఖ్యం , వారి సంతోషం ముఖ్యం. వాళ్ళు చేసిన తప్పులు మనం చెయ్యకూ డదు. అనవసరమైన కామెంట్స్ వద్దు. వాళ్ళని ఒక్క మాట కూడా అనొద్దు. వాళ్ళకి మనకి తేడా ప్రజ లు గమనించారని యువనేత నా రా లోకేష్ అన్నారు.