Advocate General: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ (Advocate General) గా ఇవన సాంబశివ ప్రతాప్ (Sambasiva Pratap) నియమి తులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం, తిల్లపూ డి గ్రామానికి చెందిన సాంబశివ ప్రతాప్ ఉమ్మడి హైకోర్టులోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ (High Court of Andhra Pradesh) సీనియర్ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. బీఎస్సీ బీఎల్, డి.పి.ఎం పూర్తి చేసిన ప్రతాప్ ఉన్నత న్యాయస్థానంలో 40 సంవ త్సరాలుగా ప్రాక్టీస్ చేసిన అనుభ వం ఉంది.
1996 – 2002 మధ్య మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఆంధ్రా రీజన్ మున్సిపాలిటీలకు (Andhra Region Municipality) సేవలు అందించారు. 2016-2019 ఉమ్మడి హైకోర్టులో (high court) ప్రభుత్వ న్యా యవాది(జి.పి)గా పని చేశారు. పలు ప్రముఖ బ్యాంకులు, ఇన్సూ రెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా (Standing Council) విధు లు నిర్వర్తించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి న్యాయ పరమైన సేవలు అందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.