–ఢిల్లీలో కుండపోతతో కూలిన ఎయిర్ పోర్టు టెర్మినల్ పైకప్పు
–22.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, ఒకరు మృతి, 8 మందికి గాయాలు
–లోతట్టు ప్రాంతాలు జలమయం ట్రాఫిక్ జామ్
–ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Airport Terminal:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తాగునీటి కోసం అల్లాడిన ఢిల్లీలో (delhi) నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురు స్తోంది. కుండపోత వర్షం (Torrential rain) కురవడం తో పలు ప్రాంతాలు జలమయమ య్యాయి. బలంగా వీస్తున్న ఈదు రుగాలుల ధాటికి ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని (Indira Gandhi Airport)టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కూప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంస మయ్యాయి.
మధ్యాహ్నం 2 వరకు టెర్మినల్ 1 నుంచి డిపార్చర్ కు (Departure) బ్రేక్ ఇచ్చారు. పునరుద్ధరణ పనుల అనంతరం సర్వీసులను కొనసాగించ నున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో (delhi) పాటు ఘజి యాబాద్, నోయిడా, ఫరీబాద్, ఎన్ఆర్సీలోని పలు ప్రాంతాలు జలమయమ య్యాయి. ఆర్కే పురం, సరితా విహార్, మునిర్కా, ఇండియా గేట్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఇం డ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ప్రధాన రూట్లలో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. జన జీవనం స్తంభించింది. ఒక్క రోజే 22.8 సెంటీమీటర్లవర్షపాతం నమో దైందని వాతావరణశాఖ (Department of Meteorology) అధికారులు తెలిపారు.
ఎయిర్ పోర్టుకు మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu) ..ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం లోకుప్పకూలిన టెర్మినల్-1 పై కప్పును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రయాణికులకు తగి న ఏర్పాట్లు చేయాలని అధికారుల కు సూచించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్టు మంత్రి చెప్పారు.