Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anirudh Remuneration : దేవర కోసం అనిరుద్ రెమ్యునరేషన్ ఏంతో తెలుసా..?

Anirudh Remuneration: ప్రస్తుతం మన సినీ ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పేరు బాగా హాట్ ఫేవరెట్‌గా మారిపోయాడు అన్న మాటలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఏఆర్ రెహమాన్ కోసం దర్శకులు, నిర్మాతలు నెలల తరబడి ఎదురుచూస్తే ప్రస్తుతం మాత్రం అనిరుధ్ రవిచందర్ కోసం ఎదురుచూస్తున్నారు మన దర్శక నిర్మాతలు.

అయితే అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతంతో ఫ్లాప్ సినిమాని కూడా ఎలివేట్ చేయగల సమర్థం ఉంది. సినిమా ఎలా ఉన్నప్పటికీ అనిరుద్ సంగీతం ఆ సినిమా లెవల్‌ ను మార్చేస్తుంది. అతి తక్కువ సమయంలోనే అనిరుద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నాడు. తమిళ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుద్. ఆ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమా ‘జైలర్’ (JAILER) బ్లాక్ బస్టర్ అయింది, ఆ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన రజనీకాంత్.. ‘జైలర్’ సినిమాను డబ్బింగ్ చెబుతూ ఓ మాములు సినిమా (CINIMA) ఫ్లాప్ అవుతుందేమో అని ఫీలయ్యా.. కానీ అనిరుద్ సంగీతంతో సినిమా పెద్ద హిట్ అయ్యిందని చాల మంది అన్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘దేవర’ సినిమా కు కూడా అనిరుద్( Anirudh Ravichander) సంగీతం అందించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలైన భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఒకటి జూనియర్ ఎన్టీఆర్, మరొకటి అనిరుధ్ సంగీతం అని అనడం లో సందేశం లేదు. ఈ రెండూ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాయి. మొదట్లో దేవర మ్యూజిక్ పై అభిమానులు, ప్రేక్షకుల్లో అనుమానాలు ఉండేవి.

కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అనుమానాలు అని కూడా మాయం అయ్యాయి. దేవర సినిమాను తన మ్యూజిక్ (MUSIC)తో నెక్స్ట్ లెవల్ కూడా తీసుకెళ్లాడు అనిరుద్. 33 ఏళ్ల అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడు అనే చెప్పాలి. ఏఆర్ రెహమాన్ తో పోలిస్తే అనిరుధ్ ఎక్కువ పారితోషికం అందుకున్నాడు. అనిరుధ్ ఒక్కో సినిమాకు దాదాపు 12 కోట్లు పారితోషికం (reward) తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దేవర సినిమాకు కూడా అనిరుద్ రూ.12కోట్లు అందుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ప్రతి సినిమాకు పది కోట్లు తీసుకుంటున్నాడు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ 8 కోట్లు, కీరవాణికి దాదాపు 5 నుండి 6 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం..