
Ap liquor raj kasireddy Ed arrests : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలు గు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరె క్టరేట్ (ED) పం జావిసిరింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్ర కంపనలు ఇప్పుడు భాగ్యనగరాన్ని కుదిపేస్తున్నాయి. తెల్ల వారు జా ము నుంచే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ డీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ షాకిచ్చా రు.
ఈ దాడుల్లో ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి (raj kasireddy) ఇళ్లే లక్ష్యంగా తనిఖీలు జరుగుతున్నాయి. హై దరాబాద్ వ్యాప్తంగా మొ త్తం 10 చోట్ల ఈడీ బ లగాలు రంగంలోకి దిగాయి.రాజ్ కేసి రెడ్డితో పాటు ఈ వ్యవ హా రంతో సంబంధం ఉన్న మరో ఆ రుగురు నిందితుల ఇళ్ల లోనూ అధి కారులు సోదాలు జరు పుతున్నారు. ఈ లిక్క ర్ స్కామ్లో వందలు కాదు.. ఏకంగా వేల కోట్ల రూపా య లు చేతులు మారినట్లు బలమైన ఆరో పణలు వస్తున్నాయి.
హవాలా రూట్ మనీలాండరింగ్ వేటు
కేవలం మద్యం వ్యాపారంలో అ వినీతి మాత్రమే కాదు దీని వెనుక పెద్ద నెట్వర్కే నడిచినట్లు ఈడీ ప్రా థమికంగా గుర్తిం చింది. అక్రమంగా సంపాదించిన సొమ్మును హవాలా, మనీ లాండరింగ్ మార్గాల ద్వారా విదేశాలకు లేదా ఇతర రంగా లకు తరలించినట్లు ఈడీ పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
ప్ర స్తుతం జరుగుతున్న సోదాల్లో ఎలాంటి కీలక పత్రాలు, న గదు దొరు కుతాయనేది ఇప్పుడు తెలుగు రా ష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ దాడుల తర్వాత అరె స్టుల పర్వం మొదలవుతుందా? ఈ లి క్కర్ సిండికేట్ వె ను క ఉన్న ఆ ‘పె ద్ద తలకాయలు’ ఎవరు? అనేది త్వరలోనే తే లనుంది. మొత్తానికి ఏపీ లిక్కర్ వ్యవహారం మరోసారి హైటెక్కింది.





