BIG Breaking: ప్రజా దీవెన, పంజాబ్: పంజా బ్ లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా సిం గేవాలా గ్రామంలోని బాణసంచా క ర్మాగారంలో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ పేలుడులో ఐదుగురు వలస కార్మికులు మరణించగా మ రో 29మంది గాయపడ్డారు. అర్ధరా త్రి ఒంటిగంట సమ యంలో జరిగిన ఈ పేలుడు ధాటికి కర్మాగారం పూర్తి గా కుప్పకూలింది.ఆ వెంటనే మంట లు అంటుకున్నాయి. అయితే, భవ నం కూలడం వల్లే ప్రాణనష్టం సంభ వించిందని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను బఠిండాలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్సెస్ (ఎయిమ్స్), ముక్త్సా ర్లోని ఆసుపత్రులకు తరలించా రు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహా యక బృందాలు శిథిలాలను తొల గిస్తున్నాయి.వాటికింద ఎవరైనా చి క్కుకుని ఉండొచ్చన్న అనుమానం తో గాలింపు చర్యలు కొనసాగిస్తు న్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు. కర్మాగారం హ ర్యానా సరిహద్దుకు సమీపంలో ఉం డటంతో అనుమతులు, భద్రతా ప్ర మాణాలపై అధికారులు దృష్టి సారి స్తున్నారు.