BIGG BOSS8: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ మాములుగా లేదు. చూస్తుంటే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళు యష్మిని గట్టిగానే టార్గెట్ చేశారని అర్థం అవుతుంది. ఇప్పటికే నయనిపవని, హరితేజ, తేజ, అవినాష్, మెహబూబ్, గౌతమ్.. ఇలా వచ్చిన వారందరూ యష్మీని నామినేట్ చేశారు. దాంతో యష్మీ (Yashmi)డేంజర్ జోన్ లో ఉంది . ఆమెను నామినేట్ చేసిన దానికంటే మణికంఠను ఎందుకు నామినేట్ చేయడం లేదు అని తెగ ఫీల్ అవుతుంది యష్మీ.
తాజగా నిన్నటి ఎపిసోడ్ లో తేజ మణికంఠను నామినేట్ చేస్తుంటే తెగ సంబరపడిపోయింది. రాక్షసానందం పొందింది. దాంతో అవినాష్ యష్మీని నామినేట్ చేస్తూ.. మీకు ఎందుకు అంత పగ.. మణికంఠను (manikanta) నామినేట్ చేస్తుంటే ఆంత ఆనందపడిపోతున్నావ్.? అని క్లాస్ పీకాడు.అవినాష్ అంతరం వచ్చిన రోహిణి కూడా యష్మీని నామినేట్ చేస్తూ గట్టిగానే ఇచ్చిపడేసింది. నబీల్-పృథ్వీ ఆడినప్పుడు పృథ్వీకి ఆడటం చేతకాక.. ఓడిపోతే నువ్వెందుకు ఏడ్చావ్..? నువ్వు చేసిందే తప్పు.. మళ్లీ సంచాలక్గా ఉన్న ప్రేరణని తప్పు చేయమని చెప్పి.. ఆమెపై పగపెంచుకున్నావ్.. పృథ్వీ (prudhvi) చాలా కష్టపడ్డాడూ.. కష్టపడ్డాడూ అంటే.. నబీల్ కాళ్లు చాపుకుని కూర్చున్నాడా? ఆంటూ లా పాయింట్ లాగింది. దింతో ఒక్కసారిగా యష్మీకి ఎదురు దెబ్బ తగిలింది.
అనంతరం రంగంలోకి వచ్చిన గంగవ్వ (Gangavva )విష్ణు ప్రియను నామినేట్ చేయగా. గంగవ్వ చెప్పిన పాయింట్ కు విష్ణు ప్రియా చూసి షాక్ అయ్యింది . అయితే గంగవ్వ చెప్పింది ఒకే ఒక్క పాయింట్ కానీ మొఖం మీద కొట్టినట్టు చెప్పింది . విష్ణు ప్రియాను నామినేట్ చేస్తూ.. కాళ్లూ చేతులు బాగానే ఉన్నాయి కదా.. ఆట ఎందుకు ఆడటం లేదంటూ విష్ణు ప్రియని నామినేట్ చేసింది దెబ్బకు విష్ణు ప్రియా షాక్ అయ్యింది . ఆ తర్వాత రాయల్ టీమ్ (royal team) నుంచి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పగానే టీమ్ మొత్తం డిస్కస్ చేసి మెహబూబ్, అలాగే గంగవ్వను నామినేట్ చేశారు. గంగవ్వను కేవలం టీ పెట్టలేదు అన్న కారణంతో నామినేట్ చేశారు రాయల్ టీమ్.