BJP: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారతీయ జనతా పార్టీలో (BJP) గడిచిన పది సంవత్సరాలుగా బీసీ సామా జిక వర్గాలకు అన్యాయం జరుగు తుందని బీసీ కుల సంఘాల (BC caste communities)ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు పాలకూరి రవిగౌడ్ ఆరోపించారు.అధికారంలో వున్న బిజేపీ బీసీలకు (bcs) ఏమైనా చే సిందా అంటే అన్యాయమే చేసింది అని అన్నారు. తాను బీసీనని చెప్పు కుంటున్న ప్రధానమంత్రి బీసీ సామాజిక వర్గాలకు మోసం చేస్తూ పది సంవత్సరాలు కాలం గడిపే శారని అన్నారు. బీజేపి బీసీలకు చేస్తున్న అన్యాయానికి సాక్ష్యం బీసీ కులగణన (BC Census) చేయకపోవడo అని అన్నారు. బీసీలను హక్కున చేర్చుకోవడానికి బీజేపి ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని 140 కోట్ల మంది జనాభలో 70 కోట్ల మంది బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఉంటే నేటికీ ఎన్నో బీసీ కులాలు వాళ్ళు చట్టసభల మెట్లు ఎక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగణన అని ఇంకా ఎంతకాలం అడగాలని ఈ దేశంలో చెట్లకు, పుట్టలకు లెక్కలు ఉన్నాయి కానీ సమాజంలో ప్రాణం ఉన్నా మను షులకు లెక్కలు లేవని రవిగౌడ్ వాపోయారు. పలు ప్రాంతీయ పార్టీ ల సహకారంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (modi) బీసీలకు మేలు చేసే నిర్ణ యాలు తీసుకుంటారని ఆశిస్తు న్నామని చెప్పారు.ఈ సమా వేశం లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు రాజరికం నరసింహ్మ చారి, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కల సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.