–గోశాలల నిర్మాణం సైతం హర్షనీ యం
–సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాజా సింగ్ కితాబు
–గోసంరక్షణ పోలీస్ ఫోర్స్ ఏర్పా టు చేయాలని వినతి
–పటిష్ట ఫోర్స్ లో నాకూ సభ్యత్వం కల్పించాలని విజ్ఞప్తి
— బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సం చలన వ్యాఖ్యలు
BJP MLA Raja Singh: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం, తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు, విధి విధానాలపై కమిటీని వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభినందన ల జల్లు కురిపించారు. సీఎం నిర్ణ యాల పట్ల ధన్యవాదాలు తెలిపా రు. ఈ సందర్భంగా బుధవారం ఆ యన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను ఇల్లీగల్ స్లేటర్ హౌస్లో చంపుతున్నారని దాని గురించి సీ ఎం ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి చె ప్పాలని కోరారు. మోడల్ గోశాలలు కడుతున్నారని, చాలా మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెను కా డబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధి కారులను ఆదేశించారు. ఇందుకో సం ముగ్గురు అధికారులతో ఒక క మిటీని నియమించారు. గోవుల సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో అ మలవుతున్న విధానాలను అధ్య యనం చేయాలని ఈ కమిటీని కో రారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కా ర్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవ సాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఈ కమిటీలో ఉన్నారు. గో సంరక్షణపై రేవంత్ రెడ్డి మంగళవా రం సాయంత్రం తన నివాసంలో స మీక్ష నిర్వహించారు. మన సంస్కృ తిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూ చించారు. గోశాలలకు భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తు న్నారని, కానీ వాటి సంరక్షణకు త గినంత స్థలం లేకపోవడం, ఇతర సమస్యలతో అవి ఎక్కువ సం ఖ్యలో మృత్యువాత పడుతున్నా యని రేవంత్ ఆవేదన వ్యక్తం చే శారు. ఈ సమస్యను అధిగమిం చేందుకు రాష్ట్రంలో తొలుత నాలు గు ప్రాంతాల్లో అత్యాధునిక వస తులతో గోశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.
*విశ్వవిద్యాలయం సమీపంలో తొలుత…* వేములవాడ, యాదగి రిగుట్ట, హైదరాబాద్ నగర సమీపం లోని ఎనికేపల్లి, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని వి శాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలన్నారు. వేములవాడలో కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబ ర్చాలని సీఎం సూచించారు. వేము లవాడ సమీపంలో వంద ఎకరాల కు తక్కువ కాకుండా గోశాల ఉండా లన్నారు. అనంతరం రాష్ట్రంలో గో శాలల నిర్వహణకు సంబంధించిన విధానపత్రాన్ని అధికారులు సీఎం కు అందజేశారు. కూడా ఉంచాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సిఎం రేవంత్ రెడ్డిని కోరారు. దేశంలోని ముఖ్య మంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవర ని అడిగితే, గుర్తుకు వచ్చే రెండవ పేరు రేవంత్ రెడ్డిదేనని అన్నారు. మొదటి పేరు యూపీ సీఎం యోగి అని పేర్కొన్నారు. ఈ పనులన్నీ ముఖ్యమంత్రి చేస్తే భారత దేశంలోx ఒక మంచి గుర్తింపు దొరుకుతుంద ని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
గో రక్షణ గురించి ఒక స్పెషల్ పోలీ స్ ఫోర్స్ తయారు చేయాలని, అం దులో ఒక మెంబర్గా తనను కూ డా ఉంచాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సిఎం రేవంత్ రెడ్డిని కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ము ఖ్యమంత్రి ఎవరని అడిగితే, గుర్తు కు వచ్చే రెండవ పేరు రేవంత్ రెడ్డి దేనని అన్నారు. మొదటి పేరు యూపీ సీఎం యోగి అని పేర్కొన్నా రు. ఈ పనులన్నీ ముఖ్యమంత్రి చే స్తే భారత దేశంలో ఒక మంచి గుర్తిం పు దొరుకుతుందని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.