Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Congress Party: కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్ లు

చౌటుప్పల్ మున్సిపాల్టీ బి ఆర్ ఎస్ కౌన్సిలర్ లు ఆ పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రజా దీవెన,చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాల్టీ బి ఆర్ ఎస్ కౌన్సిలర్(BRS party councilors)లు ఆ పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress party) తీర్థం పుచ్చుకున్నారు. చౌటు ప్పల్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) సమక్షంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అధ్యక్షతన జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో ఆరుగురు బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కౌన్సిలర్లు ఎండి బాబా షరీఫ్, కొరగొని లింగస్వామి, శ్రీమతి బత్తుల రాజ్యలక్ష్మి, బండమీద మల్లేష్, శ్రీమతి బొడిగె అరుణ బాలకృష్ణా, సుల్తాన్ రాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిoది.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడురి వెంకట్ రెడ్డి, జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనా రెడ్డి, మండల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్,మొగుధాల రమేష్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

BRS party councilors joined Congress party