–వర్గీకరణ కాంగ్రెస్ పాలసీనా, రేవంత్ రెడ్డి సొంత ఎజెండానా
–దళితులపై ప్రేమ ఉంటే రిజర్వే షన్లను పెంచాలి
–ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య
Chairman G. Chennaiah: ప్రజా దీవెన, నల్లగొండ: ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఎస్సీ వర్గీకరణ జోలికి వచ్చి ఎస్సీలను వర్గీకరించాలని చూస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి (Revanth Reddy) మార్పు ఖాయమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య (Chairman G. Chennaiah), కో చైర్మన్ బాలకిషన్ హెచ్చరిం చారు.ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పాలసీనా లేక రేవంత్ రెడ్డి ఎజెం డానా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని భాస్కర్ టాకీస్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమా లవేసి నల్లగొండ పట్టణంలో కళాకా రులతో భారీ ర్యాలీ నిర్వహిం చారు.అనంతరం టీఎన్జీవోఎస్ భవనంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో చెన్నయ్య (Chairman G. Chennaiah) మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దళితు లపై ప్రేమ ఉంటే 15 శాతం ఉన్న రిజర్వేషన్లను 30 శాతానికి పెంచా లని,2014 నుండి ఎస్సీ కులగల చేపట్టాలని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ విషయంలో దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిదంగా అత్యు త్సాహం చూపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోని అంశాలను,2011 జనాభ లెక్కల ఆదారంగా పరిగనిస్థామ నటం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయినప్పుటికి దళితుల స్థితిగతుల అద్యాయ నానికి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ జనాబా లెక్కలు తీసుకుంటా మని ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఎస్పీ వరీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 తరువాత ఉన్న అధికారిక జనాబా లెక్కల ఆదారంగా దళితుల స్థితిగతు లపై అధ్యయనం చేసి వెనుకబడ్డ కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్య, ఉద్యోగ,సంక్షేమ (Education, employment, welfare)పదకాలైన మూడెకరాల భూమి,దళిత బందు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మొదలైన వాటిలో ఎవరు ఎక్కువ లబ్ధి పొందారో లెక్కలు తీసి ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి పొందని వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ద్వారా అభివృద్ది పదం లోకి తీసుకు రావాలని, వర్గీకరణ సాకు తో దళితులను చీల్చి రిజర్వేషన్లను విచ్చినం చేసే కుట్రలను చేయవద్దని చెన్నయ్య సూచించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఎస్సి డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేకపోయారు? ఎస్సీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు.ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సాకుగా చూపి మొత్తం ఉద్యోగాల భర్తీనే (Replacement of jobs) నిలిపివేసే ఆలోచన తో సీఎం ఉన్నారని ఆరోపించారు.అంటరాని తనం సామాజిక వివక్షత పునాదిగా భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఆర్థిక పరమైన తేడాలు చూపుతూ ఎస్సీ లను వర్గీకరణ చేస్తామనటం రాజ్యాంగ స్ఫూర్తికి,ఆర్టికల్ 341 విరుద్ధమని పునరుద్ఘాటించారు.
ఎస్సీ వర్గీకరణ (Classification of SC) తెలంగాణలో అవసరమే లేదని,తెలంగాణలో ఎక్కువ లబ్ధి పొందింది మాదిగ లేనని తెలిపారు.మాల మంత్రి లేని ఉత్తం కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) నేతృత్వంలోని మంత్రుల ఉప సంఘాన్ని వెంటనే రద్దు చేయాలని, కాంగ్రెస్ పార్టీ విధాన మైన కులగణనను వెంటనే జరిపించి 22 శాతం గా ఉన్న ఎస్సీల జనాభా కనుగుణంగా రిజర్వేషన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.గత 30 ఏళ్లుగా మాలలు పూర్తిగా అన్యాయానికి గురయ్యారని ఆవేదన చెందారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని మాలలు అహర్నిశలు పనిచేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం పనిచేసిన మందకృష్ణ మాటలు విని మాలలకు అన్యాయం చేయాలని చూస్తే సీఎం పై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ పై ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను బేషరతు గా వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రవి,చెరుకు రాంచందర్, మేక వెంకన్న, బూర్గుల వెంకటేశ్వర్లు,గోపాజు రమేష్, మంచాల లిoగా స్వామి, జి. శీను, నల్లాల కనకరాజు,కరణం కిషన్, తల్లమాల హస్సేన్, జిల్ల కో కన్వీనర్లు చింతపల్లి బాలకృష్ణ, గోలి సైదులు,అద్దంకి రవి, ఉద్యోగ, మహిళా నాయకులు పాల్గొన్నారు.