–శాంతిస్థాపనకు పరస్పర సహ కారం
–ఉభయ దేశాల సంబంధాల బలో పేతానికి సమిష్టి ప్రయత్నం
–ఆస్ట్రియా చాన్స్లర్ నెహామర్,ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన
Chancellor of Austria Karl: ప్రజా దీవెన, వియన్నా: ఆస్ట్రియా చాన్స్లర్ కర్ల్ (Chancellor of Austria Karl)నెహామర్తో (Nehamar) ఫలప్రద మైన చర్చలు జరిగాయని ప్రధాని మోదీ (modi) బుధవారం వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమా సియాలో నెలకొన్న పరిస్థితులు సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగు తున్న వివాదాలపై తాము విస్తృ తంగా చర్చలు జరిపినట్లు తెలిపా రు. ఇది యుద్ధానికి సమయం కాదు అని మోదీ పునరుద్ఘాటించా రు. ఏ సమస్యలనైనా చర్చలతోనే పరిష్కరించుకోవాలని, యుద్ధాలతో కాదని స్పష్టం చేశారు. రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించు కున్న మోదీ మంగళవారం రాత్రి వియన్నా చేరుకున్నారు. ఒక భార త ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1983లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ (Prime Minister Indira Gandhi) అక్కడ పర్యటించగా ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మోదీ వెళ్లడం విశేషం. ఆస్ట్రియా విదేశాం గ మంత్రి అలెగ్జాండర్ స్కాలెన్బర్గ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. తర్వాత చాన్స్లర్ నెహామర్ మోదీ కి విందు ఏర్పాటు చేశారు. అనంత రం జరిగిన చర్చల్లో భారత్ ఆస్ట్రి యా దేశాల మధ్య ద్వైపాక్షిక బంధా లను మరింత బలోపేతం చేయడా నికి సంబంధించిన ప్రణాళిక రూ పొందించాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. చాన్స్లర్ నెహా మర్, నేను ప్రపంచవ్యాప్తంగా ప్రస్తు తం నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇతర సమస్యలపై చర్చించాం. ఇది యుద్ధానికి సమయం కాదని నేను ఇప్పటికే చెప్పాను.
యుద్ధం (war) ద్వారా సమస్యలను పరిష్కరించుకోలేం. ఎక్కడైనా సరే అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని నెహా మర్తో కలిసి సంయుక్త మీడియా ప్రకటనలో మోదీ (modi) పేర్కొన్నారు. శాంతిస్థాపనకు చర్చలు, దౌత్య పరమైన మార్గాలే శరణ్యమని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా తాము సిద్ధమని ప్రకటించారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన ప్రక్రియలో భారత్ది కీలక పాత్ర అని నెహామర్ (Nehamar) చెప్పారు. తటస్థ దేశంగా ఉన్న ఆస్ట్రియా శాంతి చర్చలకు సరైన ప్రాంతమని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నవకల్ప నలు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, నీరు, వ్యర్థాల నిర్వహ ణ, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాలు కలిసి పని చేసి, ఆయా రంగాల్లో బలోపేతం కావాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య యువత ఆలోచనలను పంచు కునేందుకు స్టార్టప్ వ్యవస్థ వారధి గా నిలుస్తుందన్నారు. భారత్లో పెట్టుబడులకు ఆస్ట్రియా కంపె నీలను మోదీ ఆహ్వానించారు. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో అవకాశాలున్నాయని తెలిపారు. కాగా, మంగళవారం రాత్రి వియన్నా చేరుకున్న మోదీకి ‘వందేమాతరం’ ఆలపిస్తూ స్వా గతం పలికడం చెప్పుకోదగ్గ విషయం.