–పిల్లలకు భాషా పరిజ్ఞానంతో పా టు నైపుణ్యాలు నేర్పించాలి
–ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండాలి
–విద్యార్థుల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి
–గురుకులాల సదుపాయాలు డే స్కాలర్స్కూ కల్పించే అంశంపై అ ధ్యయనం చేయాల
–విద్యా శాఖ సమీక్షలో ముఖ్య మంత్రి ఏ.రేవంత్ రెడ్డి
Chief Minister A. Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెం పే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి వి ద్యా lర్థికి నాణ్యమైన విద్య అందా లని, ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్ష ణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేద ని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమం లోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎ క్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు. పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారు లతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందే లా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో బోధన ప్రమాణాల పెంపునకు తీసుకోవా ల్సిన చర్యలను అధికారులకు సూ చించారు. విద్యార్థులకు భాషా పరి జ్ఞానంతో పాటు నైపుణాల పెంపు నకు వీలుగా విద్యా వ్యవస్థను మా ర్పు చేయాలని సీఎం సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల కు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్య త్లో వారు తమకు ఇష్టమైన రంగం లో రాణించే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగా ణలో పట్టణీకరణ వేగంగా సాగుతు న్న నేపథ్యంలో విద్యా శాఖ పుర పాలక శాఖతో సమన్వయం చేసు కొని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాల లు ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వి విధ విభాగాల కింద ఇంటర్మీడియ ట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థ లను హేతుబద్దీకరించి ప్రతి పాఠశా లలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాణ్యమైన భో జనం, యూనిఫాంలు, పాఠ్య పుస్త కాలు అందిస్తుండడంతో పెద్ద సం ఖ్యలో విద్యార్థులు గురుకులాల వై పు మొగ్గు చూపుతున్నారని, డే స్కాలర్స్కూ ఆ పాఠశాలల్లోనే అ వన్నీ అందించే విషయంపై అధ్య యనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు కుటుంబం, సమాజం పట్ల వారి బా ధ్యతను తెలియజేసేలా కౌన్సె లింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢం గా తయారవడంతో పాటు బాధ్య తాయుతమైన పౌరులుగా రాణి స్తారని సీఎం అన్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సల హాదారు కేశవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.