Chirumarthi Lingaiah: ప్రజా దీవెన, చిట్యాల: పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇచ్చి వారి సమస్యలను పరి ష్క రించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చి ట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల లో మౌలిక సదుపాయాలు కరువైనవని సీజన ల్ వ్యాధులు విజృంభిస్తున్నాయనీ కనీస వసతులు బ్లీచింగ్ సప్లై (Bleaching Supply) చేయ లేని పరిస్థితిలో ఉన్నారని విమర్శిం చారు. విపరీతమైన పనిభారంతో గ్రామపంచాయతీ కార్యదర్శులు లాంగ్ లీవ్ కొరకు ఎంపీడీవో వద్ద దర ఖాస్తులు చేసుకుంటున్నారు. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల కు నీరు పోసే పరిస్థితి లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే కార్మికుల పక్షాన పోరాటం (Struggle on behalf of workers)చేయ డానికి బిఆర్ఎస్ (brs) సిద్ధంగా ఉందని ప్రభుత్వానీ హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో గోధు మగడ్డ జలంధర్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పొన్నం లక్ష్మ య్య, కోనేటి ఎల్లయ్య కంధాటి రమేష్ రెడ్డి,అశోక్, తదితరు లు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.