–గూగుల్ ప్రారంభo నుంచి ప్రపం చమే మారిపోయింది
–మన జీవితాలు నేడు పూర్తిగా డి జిటలైజ్ గా మారిపోయాయి
— అదే సమయంలో గోప్యత,భద్రత పట్ల ప్రస్తుతం ఆందోళన నెలకొంది
–ఉత్తమ పెట్టుబడులకు తెలంగా ణ నూటికినూరుశాతం అనుకూలం
–గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రె డ్డి
CM Revanth reddy : ప్రజా దీవెన హైదరాబాద్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే గూగుల్ మొ దటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంద ని ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రపంచం లో ఐదవది మాత్రమే అని, గూగు ల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపం చం మారిపోయిందని, నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్గా మా రాయని తెలిపారు. గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతు న్నామని గుర్తు చేశారు. ‘మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవి తాలు డిజిటల్గా మారాయని, డిజి టల్ సురక్షితంగా ఉంటే, మనం మ రింత అభివృద్ధి చెందుతామని చె ప్పుకొచ్చారు. అధునాతన సైబర్ సె క్యూరిటీ , భద్రతా పరిష్కారాల కో సం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్ను ఉపయోగిస్తున్నందుకు గ ర్విస్తున్నట్లు తెలిపారు. ఇది నైపు ణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతుంద న్నారు.ఉత్తమ పెట్టుబడికి తెలంగా ణ అనుకూలమని పునరుద్ఘాటిం చారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ ఉపాధిని సృష్టించడంతో పా టు దేశం సైబర్ భద్రతా సామర్థ్యా న్ని పెంచుతుందన్నారు. చెడు చే యవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాం తమని, ఈ విధానాన్ని తాను ఇష్టప డుతున్నట్లు తెలిపారు. గూగుల్ లా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మం చిని మాత్రమే చేస్తుందని నమ్ముతు న్నానన్నారు. ఈ విధానం వల్ల ప్ర యోజనాలు కొంత నెమ్మదిగా కనిపి స్తాయని, అయితే మనం దీర్ఘకాలి కంగా దృష్టి పెట్టి పని చేయాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉ త్తమ పెట్టుబడికి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తె లంగాణ అని వస్తుందన్నారు. సెర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ వ స్తుందని సీఎం అన్నారు. దీనిని తె లంగాణ రైజింగ్ అని పిలుస్తామని 2035 నాటికి తెలంగాణను $1 ట్రి లియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వ రులను చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
*గూగుల్, హైదరాబాద్ పూర్వ మిత్రులు….* గూగుల్ ఆఫీస్ ప క్కన రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కో సం స్టాల్స్ ఏర్పాటు చేశామని రై తులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉం చాలనుకుంటున్నామని తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచడం తో పాటు వారికి ఉపాధి కల్పించా లని అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు గూగుల్ మద్దతు కావాల ని, తెలంగాణ రైజింగ్కు బ్రాండ్ అం బాసిడర్లుగా కావాలని కోరుకుంటు న్నామన్నారు. గూగుల్, హైదరాబా ద్ పాత స్నేహితులన్నారు. 2007 లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూ గుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని గుర్తుచే శారు. దాదాపు 7,000 మంది గూ గుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్ ను తమ ఇల్లుగా భావిస్తున్నారన్నా రు.
*గూగుల్ మాదిరే మాది వినూ త్న ప్రభుత్వం…* విద్య, భద్రత, మ్యాప్లు, ట్రాఫిక్, స్టార్టప్లు, ఆ రోగ్యం ఇలా అనేక రంగాలలో గూ గుల్తో కలిసి పనిచేస్తున్నామన్నా రు. గూగుల్ ఒక వినూత్న సంస్థ, త మది ఒక వినూత్న ప్రభుత్వమని తె లిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కో సం ట్రాన్స్జెండర్లను నియమించి నట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభు త్వా లు ట్రాన్సజెండర్స్ ని నిర్లక్ష్యం చేశాయన్నారు. జీహెచ్ఎంసీ కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్జెండర్ల ను నియమించుకుంటోందన్నారు. నాణ్యమైన విద్య తమ లక్ష్యమని, ఇందుకోసం యంగ్ ఇండియా నైపు ణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను తీసుకువస్తున్నామని తెలిపారు.
*నైపుణ్యo పెంపుకై యంగ్ ఇం డియా స్కిల్స్ యూనివర్సిటీ…*
తెలంగాణలో ప్రతీ సంవత్సరం 1. 10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్ల నుం చి వస్తున్నారని, చాలా మంది వి ద్యార్థులకు నైపుణ్యం ఉండడం లే దన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నే తృత్వంలో యంగ్ ఇండియా స్కి ల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తు న్నామన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగ స్వామ్యంలో యూనివర్సిటీ ఏర్పా టు చేస్తున్నామన్నారు. అందరికీ ఆ రోగ్యం తమ లక్ష్యమని స్పష్టం చేశా రు. ఇవే తన ప్రధాన ఆవిష్కరణల న్నారు. ‘గూగుల్ లాగానే, నా ప్రభు త్వంలో భాగస్వాములైన మహిళ లు, యువత, రైతులు, పేదలు, మ ధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమా ణాలు కల్పించాలని కోరుకుంటు న్నాను. మనం కలిసి గొప్ప ప్ర మాణాలను సృష్టిద్దాం. హైదరాబా ద్లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెం టర్ ఏర్పాటు చేసినందుకు మరో సారి అభినందిస్తున్నాను. మేం గ ర్వపడేలా మీరు పనిచేస్తారని వి శ్వసిస్తున్నానని ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి పేర్కొన్నారు.