Congress manifesto: మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తాం
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిని హామీని నెరవేరుస్తామని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.
తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి
జీవో నెంబర్317, 46 సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ
ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షు డు,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ప్రజా దీవెన, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో(Congress manifesto) పెట్టిన ప్రతిని హామీని నెరవేరుస్తామని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(balmoori venkat) అన్నారు. మంగళ వారం నల్గొండలోని మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి(Komatireddy venkat reddy) గారి క్యాంపు కార్యాల యంలో మాజీ ఎమ్మెల్సీ కపిల వాయి దిలీప్ కుమార్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభమవు తాయని స్పష్టం చేశారు. అదేవిధం గా జాబ్ క్యాలెండర్ తో పాటు నోటిఫికేషన్ పై సంపూర్ణ స్పష్టత ఇస్తామని వెల్లడించారు.
జీవో నెంబర్ 46, 317, ఇతర ఉద్యోగుల సమస్యలఫై తమ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. బిజెపి (BJP),బీఆర్ఎస్(BRS) పార్టీలు కుమ్మక్కై తీన్మార్ మల్లన్నను ఓడించేందుకు కుట్ర పూరిత వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలంతా దీనిని గమనించాలని కోరారు. గత 10సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై తీన్మార్ మల్లన్న పోరాటం చేసి తీవ్రంగా ఎండగట్టాడని అన్నారు. ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న చట్టసభలలో ఉంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను(Teenmaar mallanna) గెలిపించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ బిజెపి,బీఆర్ఎస్ ప్రభుత్వాలు గత పది సంవత్సరాలుగా నిరుద్యోగులను అన్ని విధాలుగా మోసం చేశాయని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిరుద్యోగులంతా ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలంతా పోరాటం సాగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే కెసిఆర్ పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుక అయిన తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు.
సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరుతాయని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మాజీ జెడ్పిటిసి గుంజ రేణుక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Congress fulfilled every promise in manifesto