–అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
–ఎరువులను సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలి
–సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల ద్వారా నీటి నిర్వహణ చేయాలి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ: వర్షాల కార ణంగా అంటువ్యాధులు ప్రబలకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతు లు ఇబ్బందులు పడకుండా ఎరు వుల సక్రమ సరఫరా, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సక్రమ నీటి నిర్వహణ, రేషన్ కార్డుల పంపి ణీ, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేసే లా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి మంత్రులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబం ధిత శాఖల అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు ఆయా అంశాలపై దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నివారణ భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడడం, నీటిపారు దల ప్రాజెక్టులు చెరువుల ద్వారా సరైన విధంగా నీటిని వినియోగిం చుకోవడం, రేషన్ కార్డుల పంపిణీ పై కార్యాచరణ ప్రణాళిక రూపొం దించుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.
అంతకుముందు రాష్ట్ర ముఖ్యమం త్రి ఏ. రేవంత్ రెడ్డి ఆయా అంశాల పై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో విపత్తు నిర్వహణ సంస్థలను అ ప్రమత్తం చేయాలని, భారీ వర్షాల వ ల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవ కాశం ఉన్నందున ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్, మున్సిపల్, రెవె న్యూ, పోలీస్ యంత్రాంగాలు అప్ర మత్తంగా ఉండాలని, ప్రజలకు ఇ బ్బందులు కలగాకుండా చూసుకో వాలని, ఒక్క హైదరాబాద్ లోనే 150 ఎస్ డి ఆర్ ఎఫ్ టీములు ఉ న్నాయని, పోలీస్, జిహెచ్ఎంసి సహకారంతో హైద్రాబాద్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్రవ్యా ప్తంగా వాతావరణ శాఖ ద్వారా ముందస్తు హెచ్చరికలను తెలుసు కొని ఐసీసీ ద్వారా వర్షాలు వచ్చే ప్రాంతాలకు ముందే విపత్తు నిర్వ హణ బృందాలను పంపించి నష్టా లను నివారించాలన్నారు.
ఈ విషయంలో పోలీసులతో సమ న్వయం చేసుకోవాలన్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో వర్షాల సమయంలో పిడుగుపాటుకు మనుషులు, పశు వులు చనిపోయే అవకాశం ఉంద ని, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా మనుషులు, పశువులు చనిపోతే వెంటనే సహయం అందించేలా ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చాలని చెప్పారు. వర్షాల వల్ల అం టువ్యాధులు ప్రభలే అవకాశం ఉ న్నందున కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు నీటి నిల్వ లేకుండా చూడాలని, దోమలు పెర గకుండా ఆయిల్ బాల్స్, ఫాగింగ్, పిచికారి చేయించాలని, ప్రభుత్వ డాక్టర్లందరూ అందుబాటులో ఉం డాలని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని, జిల్లా కలెక్టర్లు త ప్పనిసరిగా ప్రాథమిక వైద్య ఆరోగ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాల ని, అవసరమైతే అత్యవసర సమ యాల్లో మందులు, ఇతర వైద్య సౌక ర్యాల కు జిల్లా కలెక్టర్ల అకౌంట్ల లో కోటి రూపాయల నిధులను ఉం చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదే శించారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వా రా నీటి విడుదలపై సమీక్షిస్తూ అవ సరమైన చోట సాగునీటిని ఇచ్చే వి ధంగా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వా రా సాగునీటిని విడుదల చేయాల ని, వ్యవసాయం, నీటిపారుదల శా ఖలు సమన్వయంతో నీటి నిర్వ హణ చేపట్టాలని , కొన్ని ప్రాంతాల లో ఇప్పటికే 75 శాతం చెరువులు నిండాయని, ప్రాజెక్టులు, చెరువుల పై జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు సమీక్షిం చాలని, అవసరానికి తగ్గట్టుగా నీటి ని విడుదల చేయాలని సూచిం చారు.
రైతులు ఎరువులకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి యూరియా విషయంలో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి నా, సోషల్ మీడియాలో తప్పుదు పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసు కోవాలని, జిల్లా కలెక్టర్లు ఎరువుల నిలువలపై ప్రతిరోజూ ఆయా షాపు ల ముందు బోర్డులు ప్రదర్శించే వి ధంగా చర్యలు తీసుకోవాలని, అ లాగే ఎరువులకు ఇబ్బందులు తలే త్తకుండా చూడాలని, ఎరువుల వివ రాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ఉంచాలని, ఎరువులను ప్రత్యేకించి యూరియాను ఇతర కార్యక్రమాల కు దారి మళ్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, యూరియా పక్క రా ష్ట్రాలకు వెళ్లకుండా చూడాలని, వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను దారి మళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎరువుల పై జిల్లా స్థా యిలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చే సి పబ్లిక్ ప్లేస్ ల లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు.
రేషన్ కార్డుల పై రాష్ట్ర ముఖ్యమం త్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, 7 లక్షల పైన కొత్త కార్డులు ఇస్తున్నా మని, 31,000 మంది రేషన్ కార్డు లలో కొత్తగా నమోదయ్యారని, ఇది వరకే 96 లక్షల 95000 కార్డులు ఉన్నాయని, సన్న బియ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు విపరీత మైన డిమాండ్ పెరిగిందని, సన్న బి య్యం నూతన రేషన్ కార్డుల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నా రని, ఈనెల 25 నుండి ఆగస్టు 10 వరకు అన్ని మండలాలలో అధికా రికంగా రేషన్ కార్డులు పంపిణీ చేసే లా కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని, జిల్లాల ఇన్చార్జి మంత్రు లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకచోట రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొనాలని, జిల్లా కలెక్టర్లు అన్ని మండలాలలో సంబంధిత శాసనస భ్యులతో కలిసి రేషన్ కార్డుల పంపి ణీకి హాజరుకావాలని, ఇందుకుగా ను ఉమ్మడి జిల్లా కేంద్రంలో ముం దుగా సమావేశం నిర్వహించి ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భ ట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా నుండి మాట్లాడుతూ వర్షాలు కొద్దిగా ఆల స్యం అయినప్పటికీ ఎలాంటి ఇ బ్బంది లేదని, యూరియాకు ఎ లాంటి సమస్య ఉత్పన్నం కాదని భావిస్తున్నామని, జిల్లా కలెక్టర్లు వర్షాలతో పాటు, రేషన్ కార్డులు, సీజనల్ వ్యాధులు,సాగునీటి విడు దల వంటి అన్ని అంశాలపై సరైన నిర్వహణ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నీటిపారుదల, రేషన్ కార్డుల పై మా ట్లాడగా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ రాజనర్సిం హ వైద్య, ఆరోగ్య విషయాలపై మా ట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్య వసాయ అంశాలపై మాట్లాడారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సింహాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యా ధులను అరికట్టడంలో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతాలకు మలేరియా కిట్లను ఎక్కువ పంపిం చాలని, అలాగే గిరిజన ప్రాంతా లలో సరైన ప్రసవ సమయాలను ముందే తెలుసుకొని ప్రసవానికి గిరిజన మహిళలను సమయానికి హాస్పిటల్ కి తీసుకు వెళ్లేలా చర్య లు తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ భా రీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యా ప్తం గా ఎక్కడ ప్రాణ, నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, రాష్ట్రస్థా యిలో ఏర్పాటు చేసినట్లు గానే జి ల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పా టు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆ దేశాల మేరకు ముఖ్యమైన అంశా లపై ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వివరాలను వెల్లడించారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయ ణ అమిత్, సంబంధిత శాఖల జి ల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫ రెన్స్ కు హాజరయ్యారు.