FilmAwards: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో గత పదేళ్లుగా నిలిచి పోయిన సినిమా అవార్డుల ప్రదా నానికి కొత్త ఊపిరినిచ్చేందుకు ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ పేరి ట అవార్డులను ప్రవేశపె ట్టి న విషయం విధితమే. తెలంగాణ చల నచిత్ర రంగానికి గుర్తింపు కల్పి స్తూ, 2024లో విడుదలైన చిత్రాల కు గద్దర్ అవార్డులు ప్రకటించగా, గత పదేళ్లలో వచ్చిన చిత్రాల నుంచి ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రా లకూ అవార్డులు ఇవ్వా లని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే అవార్డు విజేతలను జ్యూ రి సభ్యులు ప్రకటించారు కూడా. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవం నే టి సాయంత్రం హైటెక్స్ వేదికగా జ రుగనుంది. ఈ వేడుకకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ము ఖ్య మంత్రి భట్టి విక్రమార్క, సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి తదితర ముఖ్య అతిథులు హాజరుకానున్నారు. కార్యక్రమా నికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
*గద్దర్ అవార్డు విజేతలు వీరే..*
*ఉత్తమ చిత్రం:* కల్కి, లక్కీ భాస్కర్, పొట్టేల్
*ఉత్తమ బాలల చిత్రం:* 35 చిన్న కథ కాదు
*ఉత్తమ సామాజిక చిత్రం:* కమిటీ కుర్రాళ్లు
*ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్:* రజాకార్
*ఉత్తమ నూతన దర్శకుడు:* ఎదు వంశీ
*హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్:* ఆయ్
*ఉత్తమ దర్శకుడు:* నాగ్ అశ్విన్ (కల్కి)
*ఉత్తమ నటుడు:* అల్లు అర్జున్ (పుష్ప 2)
*ఉత్తమ నటి:* నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
*ఉత్తమ సహాయ నటుడు* : ఎస్ జే సూర్య (సరిపోదా శని వారం)
*ఉత్తమ సహాయ నటి:* శరణ్య (అంబాజీపేట ఫేమ్)
*ఉత్తమ సంగీత దర్శకుడు* : భీమ్స్ (రజాకార్)
*ఉత్తమ గాయకుడు:* సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
*ఉత్తమ గాయని:* శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
*ఉత్తమ బాల నటులు* : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
*ఉత్తమ హాస్యనటులు:* వెన్నెల కిషోర్, సత్య
*ఉత్తమ రచయిత:* శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
*ఉత్తమ స్క్రీన్ప్లే రచయిత* : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
*ఉత్తమ పాటల రచయిత:* చంద్రబోస్ (రాజు యాదవ్)
*ఉత్తమ సినిమాటోగ్రాఫర్* : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
*ఉత్తమ ఎడిటర్* : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
*ఉత్తమ కొరియోగ్రాఫర్:* గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
జ్యూరీ స్పెషల్ మెన్షన్ (సింగర్): ఫరియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా)
*ఉత్తమ కళా దర్శకుడు:* అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మీనన్ (గామీణ)
గద్దర్ ఫౌండేషన్కు రూ. 3 కోట్లు… ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచ నలు, ఆయన ఆశ యాలను ముందుకు తీసుకెళ్లేందు కు గానూ గద్దర్ ఫౌండేషన్కు తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మం జూరు చేసింది. ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తా మని గతంలో జరిగిన గద్దర్ జయం తి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ని ధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భా షా, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్ద ర్ సేవలకు గుర్తింపుగా ఆయన జ యంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా జరుపనుంది.ఇది ఇలా ఉంటే ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహాణలోనూ గద్దర్ ఫౌండేష న్కు భాగస్వామ్యం కల్పి స్తూ మరో ఉత్తర్వును కాంగ్రెస్ స ర్కార్ జారీ చేసింది. మరోవైపు, గద్ద ర్ పేరుతో సినీ అవార్డులను తెలం గాణ ప్రభుత్వం ప్రకటించింది. శని వారం సాయంత్రం హైటెక్స్ వేదిక గా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డు లను అందించి సత్కరించ నున్నారు.