Election rules: ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీ అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు, పౌరులు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు
అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా జిల్లాలో పటిష్ట నిఘా
రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట.
ప్రజాదీవెన, సూర్యాపేట: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీ అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు, పౌరులు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా ఎవ్వరు కూడా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు అని హెచ్చరించారు. నామినేషన్ల కేంద్రాలు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేస్తామని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం కేసులు తప్పవన్నారు. ఎన్నికల కేసులు ఒక సారి నమోదైతే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని గుర్తు చేశారు.
Follow election rules for candidates