ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు రీ-అలైన్మెంట్ కు సంబంధించి ఢిల్లీలో కేంద్ర రోడ్ రవాణా శాఖామాత్యులు నితిన్ గడ్కరీతో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి కలవడం జరిగిందని తెలిపారు. దక్షిణ హైదరాబాద్ చుట్టూ అనుసరిస్తున్న 40 km దూరాన్ని ఉత్తర దిక్కున కూడా అమలు చేయాలని, చౌటుప్పల్, భువనగిరి మరియు గజ్వేల్ లాంటి పురపాలకలు రెండు ముక్కలు గా విడపోకుండా HMDA పరిధి వెలుపల నిర్మాణం జరిగేలా చూడాలని వారిని కోరడం జరిగింది అని మనోహర్ రెడ్డి తెలిపారు.
నితిన్ గడ్కరీ ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించి డిజైన్ ప్రాథమికం అని, రేడియస్ మరియు ఇతర విషయాల్లో యూనిఫార్మ్ పాలసీ అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడమైనద అని తెలిపారు.ఈ భేటీలో మనోహర్ రెడ్డి తో పాటు భువనగిరి జిల్లా రైతులు పాల్గొన్నారు. ఈ భేటికి చొరవ చూపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మనోహర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
