Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

GHMC: గ్రేటర్ హైదరాబాద్ సమావేశం రసాభాస

–బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొ రేటర్ల ఆందోళనలతో దద్దరిల్లిన సభ

GHMC: ప్రజా దీవెన, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశంలో (Council meeting) పెద్ద ఎత్తున రభస చోటు చేసుకుం ది. అంతుకు ముందు ప్రధాన కార్యాలయం వద్ద నుంచే బీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొ రేటర్ల (BRS, BJP, Congress corporators) ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్ద రిల్లింది. బీ ఆర్ఎస్ నగర ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ముందు ఫ్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్, కాం గ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణ లు చేసుకున్నారు. ఆ తరువాత సమావేశం ప్రారంభమయ్యాక కూ డా రచ్చ కొనసాగింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శిం చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ (BRS Corporators Mayor) పోడియంను చుట్టుము ట్టారు.బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్‌కు సిగ్గుండాలంటూ మండిపడ్డారు. 15 నిమిషాల పాటు సమావేశాన్ని వాయిదా వేశారు. మేయర్ విజ యలక్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ లోకి చేరిక తర్వాత జరు గుతున్న మొదటి సమావేశం కావడంతో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. బీఆర్ఎ స్ కార్పొరేటర్ల మద్దతుతో గద్వాల్ విజయలక్ష్మి, మోతె శ్రీలత మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారు. వీరి ద్దరూ పార్టీ మారడంతో మేయర్, డిప్యూటీ మేయర్‌పై (Mayor, Deputy Mayor) అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. పైగా మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ రాజీ నామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు (BRS Corporators)డిమాండ్ చేస్తున్నారు.