Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hydarabad Doublemurder : నార్సింగి జంట హత్యలో మృతుల గుర్తింపు

నార్సింగి జంట హత్యలో మృతుల గుర్తింపు

Hydarabad Doublemurder :  ప్రజా దీవెన,హైదరాబాద్‌: హైదరాబాదులో సంచలనం సృష్టిం చిన జంట హత్యల కేసులో మృతుల పోలీసులు గుర్తించారు. నార్సిం గిలో డబుల్‌ మర్డర్‌ కేసు లో మృతిచెందిన మహిళ, యువకుడి ని గుర్తించిన పోలీసులు కేసు కు సంబంధించి ప్రాథమిక సమాచా రాన్ని సేకరించారు.

మృతుల్లో ఒకరైన అంకిత్‌ సాకేత్‌ మధ్య ప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా, మరొకరుఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా ఆధారాలు లభించాయి. నానక్‌రా మమ్‌గూడలో అంకిత్, ఎల్బీనగర్‌ లో బిందు నివాస ముం టుండగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలు బిందుకు ముగ్గురు పిల్లలు ఉండగా ఈ నెల 8న బిందును అంకిత్ ఎల్బీనగర్‌ నుంచి తీసుకొ చ్చినానక్‌రామ్‌గూడలోని స్నేహి తుల రూమ్‌లో ఉంచాడు.

గచ్చిబౌ లిలో అకింత్‌ అదృశ్యమైనట్టు కేసు నమోదు కూడా కాగా వనస్థ లిపు రంలో బిందుపై మిస్సింగ్‌ కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యం లోనే సంక్రాంతి పండుగ రోజున మంగళవారం నార్సింగిలో ఇద్దరినీ దుండగులు హత్య చేసిన సంఘ టన సంచలనం సృష్టించి న విష యం తెలిసిందే. కాగా హత్యకు సంబంధించి కురువాపరాలు పరిశీ లించిన పోలీసులు కుటుంబసభ్యు లపై పోలీసులకు అను మానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో మరింత లోతైన దర్యాప్తు చేస్తు న్నట్టు నార్సింగి పోలీసులు వెల్లడించారు.