Jagadeesh reddy criticised congress: రాష్ట్రంలో రాక్షస పాలన
తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుoటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు.
పాలన చేతకాక ఫెక్ కేస్ లు, లీకులు తప్ప మరో పని లేదు
పొలాలు ఎండిపోతుంటె పట్టించుకున్నోడే లేడు
కేసీఆర్ వ్యతిరేక మీడియా కూడా విషం చిమ్ముతోంది
సమైక్య పాలనలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు
బాధుడైన లగడపాటి రాజగోపాల్ పై చర్యలు తీసుకోవాలి
మిర్యాలగూడలో ఎంపి సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన, మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుoటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. ప్రభుత్వ పరిపాలన చేతకాక ఫేక్ కేసులు యూసులతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు న్యూసులు తప్ప మరో పని లేక మతి ప్రేమించి మాట్లాడుతున్నారని విమర్శిం చారు. పంట పొలాలు ఎండిపో తుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కోసం ఆరోగ్యం సహకరించుకున్నా బయటకొచ్చిన కేసీఆర్ పై ఆయన వ్యతిరేక మీడి యా విషం చిమ్ముతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమైక్య పాలనలో కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో నా ఫోన్ కూడా ట్యాప్చే (phone tapping)శారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్ల గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్నాము, పోలీసులను ఏనాడు వాడుకోలేదని, అక్రమ కేసులు పెట్ట లేదని గుర్తు చేశారు.ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలు జాబితా ప్రభుత్వం కు ఇస్తే పట్టించుకోలేదని, అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్
కేసీఆర్ లాగు ఉడబికుతా, ఒంటి మీద గుడ్డ లేకుండా చేస్తా అంటూ బూతు పురాణం వెతు క్కుంటు న్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డా రు. ప్రతిపక్ష నాయకుల లాగు విప్పి ఎం చూస్తారు, ఇందు కేనా మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ పిచ్చి మంత్రి ఎగిరెగిరి పడుతు న్నాడు, మేము అధికారం లో వున్నప్పుడు సాగర్ డెడ్ స్టోరేజ్ లో (dead storage) కూడా నీళ్లు ఇచ్చినమని గుర్తు చేశారు. ఇప్పుడు నాగార్జునసాగర్ (Nagarjuna sagar) లో నీళ్లు వున్నా ఇవ్వలేని దద్ద మ్మలు, చేతకాని వేదవలు కాంగ్రెస్ వాళ్లంటూ జగదీష్ రెడ్డి మండి పడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు లు తూడుస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లకు ఎక్కడ పదవి వస్తుందో నా మంత్రి పదవి ఏడా పోతుందో అని కోమటిరెడ్డి లు బెంగ పెట్టుకున్నా రంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెప్పిన మాయ హామీలపై ఎక్కడికక్కడ నిలదియాలని పిలు పునిచ్చారు. గ్రామాల్లో చైతన్యం రావాలని, ప్రజలు మోసపోవద్దు కేసీఆర్ మాత్రమే తెలంగాణ కు శ్రీరామరక్ష అని గులాబీ జెండా వేసు కున్న యోధులు మన కార్యకర్తలు ఏ మాత్రం పొరపాటు చేసినా ఆగం అయితామని ఇప్పటికే తెలంగాణ సర్వనాశనం అయిందని, కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కులను కాపాడుతారని పిలుపునిచ్చారు.
Jagadeesh reddy criticised congress