–బీజేపీ, బీఆరెస్ కలిసి కుట్రలు, కుయుక్తులు
–ఫిరాయింపులపై బీఆరెస్ గురి వింద నీతులు
–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం
Jupalli Krishna Rao: ప్రజా దీవెన, హైదరాబాద్ : బీజేపీ (bjp)తో చీకటి ఒప్పందం చేసుకొని బీఆ రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూ ల్చాలని చూస్తుందని మంత్రి జూప ల్లి కృష్ణ రావు (Jupalli Krishna Rao) ఆరోపించారు. ఆది వారం సీఎల్పీ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి సంపాదనతో గతంలో కేసీఆ ర్ (kcr)ఫిరా యింపులకు పాల్ప డ్డారని, ఆ రోజు 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆ రెస్లో చేర్చు కున్నప్పుడు బీఆరెస్ గురు వింద నీతులు ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత లేద న్నారు.
కేసీఆర్ (kcr) నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీనేత నిరంజన్ రెడ్డి లెటర్ రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి కృష్ణా నదిని కూడా ఆక్రమిం చుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై (Corruption and irregularities) ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసు కుంటుందన్నారు. ప్రధాన మంత్రి పదవి కాళ్లదగ్గరకు వచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వదులుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ, బీఆరెస్ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు అంబేద్కర్ ఆయాశయాలను కాలరాస్తు న్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసమే తమ ప్రయ త్నమని మంత్రిజూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
బీఆరెస్, బీజేపీ నాయకులకు (BRS and BJP leaders) విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అంబేద్కర్. రాజ్యాంగంపై వాళ్లకు విలువలు ఉంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందే వారు కాదా అని నిలదీశారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆరెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం లో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన సాగుతుందన్న భావనతోనే ఇతర పార్టీల వారు కాంగ్రెస్ లోకి వస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రం లోని 16 ఎంపీ సీట్లు (MP seats) గెలిచి కేసీఆర్ ప్రధాని అవ్వాలని కలలు కన్నారని, ఆయనే మంచిగా పరిపాలిస్తే కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారని, ప్రజలు ఎక్కడైనా తప్పు చేస్తారా, ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేశారా, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. కేసీఆర్ అవకాశవాద, కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాల పట్ల విసుగత్తిన ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితం చేశారన్నారు.