–సీఎం సమక్షంలో చేరిన చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే
Kale Yadayah: ప్రజా దీవెన,న్యూఢిల్లీ: చేవెళ్ల బిఆర్ ఎస్ శాసనసభ్యుడు కాలే యాదయ్య (Kale Yadayah) కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి పెనుముల రేవంత్ రెడ్డి (REVANTH REDDY)సమక్షంలో శుక్రవారం న్యూఢిల్లీలో ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరా రు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTH REDDY).