Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalvakuntla Kavita: కవితను నిస్సహాయురాలిగా భావించలేం..!

–విద్యావంతురాలిగా పలుకుబడి కలిగిన మహిళగానే చూస్తాం
–మద్యం కుంభకోణంలో కవిత బె యిల్‌ పిటిషన్ల తిరస్కరించిన కోర్టు

Kalvakuntla Kavita:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరె స్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavita) మరో సారి షాక్ తగిలింది. ఈడీ, సీబీఐ (ed, cbi)కేసులకు సంబందించి ఆమె పెట్టు కున్న బెయిల్‌ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని, ఒక విద్యావంతురాలిగా పలుకుబడి కలిగిన మహిళగానే ఆమెను పరిగ ణిస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యoనించింది. ఈ రీత్యా కేసులో ఆమె పాత్ర, ఆమె కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆ ధారంగానే బెయిల్‌ (bail)ఇవ్వాలో లేదో నిర్ణయించాలే తప్ప మహిళ అన్న విషయానికి అంత ప్రాధాన్యం ఉండ కూడదని కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీలో కొత్త మద్యం విధానం కుం భకోణం ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని ఈడీ సేకరించిన సాక్ష్యాలను బట్టి తేలిందని, ఈ కేసులో మరికొందరు నిందితులు కూడా ఆమె తరఫునే పనిచేశారని, ఫలితంగా ఆమెను ఓ నిస్సహాయ మహిళగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి సమన్లు ఇచ్చిన తర్వాతే ఫోన్లు పార్మట్‌ చేశారని, ఫలితంగా కవిత సాక్ష్యాలను చెరిపేసినట్లు అనుమా నాలున్నాయని వ్యాఖ్యానించింది.

ఢిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy) కుంభకోణం లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా బల మైన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఈ దశలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయలేమని తీర్పులో స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు లో కవితను మార్చి 15న హైదరా బాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు (arrest) చేసింది. 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిం ది. కవిత తిహాడ్‌ జైల్లో (Tihad Jail) ఉండగానే ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తొలుత తన కుమా రుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్‌ (bail)ఇవ్వాలని కోరగా ట్రయ ల్‌ కోర్టు తిరష్కరించింది. తర్వాత ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు సాధా రణ బెయిల్‌ మంజూరు చేయాలని కవిత పిటిషన్లు దాఖలు చేయగా ట్రయల్‌ కోర్టు మరోసారి తిరష్క రించింది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును (Delhi High Court)ఆశ్రయించారు. బెయిల్‌ మంజూరు చేయాలని ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా 2 పిటిషన్లు కలిపి ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో ఒకేసారి విచారించింది. మే 27, 28 తేదీల్లో హైకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగా యి. ఢిల్లీ మద్యం కేసుతో కవితకు సంబంధమే లేదని, అక్రమంగా అరె స్టు చేశాయని ఆమె తరఫు న్యాయ వాదులు కోర్టులో వాదనలు వినిపిం చారు. అయితే, ఢిల్లీ మద్యంపాలసీ కేసులో కవితది కీలకపాత్రని, ఆమె సూత్రదారి, పాత్రదారి అని దర్యాప్తు సంస్థలు బలంగా వాదించాయి. వాదనలు విన్న హైకోర్టు న్యాయ మూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్‌ చేశారు. జూన్‌లో హైకోర్టులో సెలవులు ఉండడంతో ఈలోపే తీర్పు వెల్లడించాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. సెలవులకు ముందే తీర్పు ఇస్తానని న్యాయ మూర్తి చెప్పినప్పటికీ సెలవులు ముగిసిన తర్వాత సోమవారం తీర్పు ఇచ్చారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్‌ పిటిషన్లు తిరష్కరిస్తున్నట్లు తన తీర్పులో న్యాయమూర్తి వెల్లడించారు.

నేరం చేయనట్లు భావించ లేo… ఢిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy) కేసు లో ఈడీ (Ed)సమర్పించిన సాక్ష్యాధా రాలు, సెక్షన్‌ 250 కింద సాక్ష్యుల వాంగ్మూలాలు, సీఆర్పీసీ 144 కింద అప్రూవర్ల వాంగ్మూలాలు, వాట్సాప్‌ చాటింగ్‌లతోపాటు అనేక డాక్యు మెంటరీ సాక్ష్యాలు ఉన్నరీత్యా ఆమె నేరానికి పాల్పడలేదని కోర్టు నిర్ధారణకు రాలేకపోతోందని హై కోర్టు న్యాయమూర్తి, జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ తన తీర్పులో పేర్కొ న్నా రు. మనీలాండరింగ్‌ లోని సెక్షన్‌ 45 కింద ఆమెకు బెయిల్‌ ఇవ్వడానికి కారణాలేమీ లేవని చెప్పారు. తాను సమర్పించిన 9 మొబైల్‌ ఫోన్లను ఎ వరు ఫార్మట్‌ చేశారన్న విషయంపై కవిత(kavitha) స్పష్టమైన వివరణ ఇవ్వ లేదని, గత 2023 మార్చి 11న సమన్లు పంపిన తర్వాతే ఈ ఫోన్ల ను ఫార్మాట్‌ చేయడాన్ని బట్టి చూస్తే ఆమె సాక్ష్యాధారాలను చెరిపివేసి నట్లు అనుమానాలు కలుగుతున్నా యని పేర్కొన్నారు. ఫలితంగా ఇ ప్పుడు బెయిల్‌పై విడుదల చేస్తే ఆమె మరిన్ని సాక్ష్యాలను చెరిపి వేసే అవకాశం ఉన్నదని, అంతేకాక ఈ కేసులో పలువురు కీలక సాక్షు లు ఆమె సన్నిహిత సహచరులు లేదా ఉద్యోగులు కావడాన్ని విస్మరిం చలేమని కోర్టు పేర్కొంది. ఆమె సమాజంలో పలుకుబడి కలిగిన మహిళ అని, రాజకీయాల్లో కూడా ఆమె అనుభవజ్ఞురాలని, ఈ రీత్యా ఆమె సాక్షులను ప్రభావితం చేయ లేరని చెప్పలేమన్నారు. మద్యం కుంభకోణంలో దర్యాప్తు అత్యంత కీలకదశలో ఉన్నదని, తుది చార్జిషీ ట్లను దాఖలు చేయ వలసి ఉన్నద ని కోర్టు పేర్కొంది.