–పచ్చి అబద్దాలతో ప్రజల జీవి తాలు ఆగంచేస్తున్నారు
— మీడియా సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో ఏడాది పాలనపై విజయోత్సవాల పేరుతో రేవంత్ ప్రభుత్వం ప్రజా ధనం దుర్వినియోగ చేస్తోందని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు ఆరోపించారు. అట్టహాసంగా ప్రచారం చేసుకున్న ఆరు గ్యారం టీల్లో ఏదీ అమలు కావడం లేదని, కేవలం ఇక్కడి సంపదను ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కప్పం కడుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రివర్గంలోని కీలక మంత్రులు సైతం అవినీతి ఆరోపణల్లో కురుక పోయారని, గురుకులాలను బ్రష్టు పట్టిస్తు న్నారని దుయ్యబట్టారు.
అన్నం పెట్టలేని దుర్మార్గపు పాలన సాగిస్తునారని, యువత కోసం ఇస్తున్న నోటిఫికేషన్ ప్రకటనలు అన్ని తప్పుడు ప్రచారమేనని విమర్శించారు. కెసిఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ తో ఇపుడు జాబ్స్ ఇచ్చి గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఇచ్చిన కాళేశ్వరం ద్వారా వచ్చే నీటితో కోక కోలా ఫ్యాక్టరీని సీఎం ప్రారంభం చేశారని, కరెంట్ ఉండడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని, ధాన్యం కొనడం లేదు. రైతులు గోస పడుతున్నారని అ న్నారు. రైతుభరోసా, రుణమాఫీ పూర్తి చేయాలి. ఇతర హామీలు అమలు చేయాలన్నారు.
హరీష్ రావు మీద కేసులు సరికాదని, ఒక క్రిమినల్ చక్రధర్ ఇచ్చిన పిర్యాదు తో కేసు పెట్టడం దుర్మార్గమని వ్యా ఖ్యానించారు. ఇలాంటి కేసులు బిఆరెస్ కు కొత్త కాదని, ప్రజల కోసం కొట్లాడేందుకు ఎప్పుడు సిద్దమేనని స్పష్టం చేశారు. రాష్ట్రం లో దోపిడీ దొంగల రాజ్యం వచ్చి ఏడాది అవుతుందన్నారు. సాధ్యం కానీ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఏడాది కాలంలో ఏ ఒక్కటి అయినా అమలు చేసారా, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే వీటిని దోచుకుతింటున్నారని ఆరోపించారు.
ఏడాది గడిచినా 4 వేల ఆసరా పెన్షన్స్ పెంపు లేదని,రైతు భరోసా నేటికీ రాలేదని, మహా లక్ష్మి ద్వారా మహిళలకు రూ. 2500 , వికలాంగులకు . రూ 6 వేలలకు దిక్కే లేదని అన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయ కుండా ఏడాది పాటు కాలయాపన చేస్తున్నారని, ఇప్పటి వరకు వానా కాలం వరి పంటను 1.70 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారని గుర్తు చేశారు. నల్లగొండ కు రేవంత్ రెడ్డి వస్తున్నoదున ఏడాది కాలంలో నల్ల గొండకు ఏమీ చేసారో చెప్పా లని డిమాండ్ చేశారు. నల్లగొండ పునర్నిర్మాణం కోసం రూ.1300 కోట్లు కెసిఆర్ కేటాయించారని, 48 కంపెనీలతో ఐటీ హబ్ ను ప్రారంభం చేసుకున్నామని, ఒకపుడు ఐటీ మంత్రిగా చేసిన కోమటిరెడ్డి దీన్ని ఎందుకు పట్టిం చుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
తక్షణమే నల్లగొండ ఐటీ హబ్ ను వినియోగించు కోవా లని సీఎం రేవంత్ ను కోరారు.మెడికల్ కాలేజ్ ను మేము పూర్తి చేస్తే ప్రారంభం కోసం వస్తున్నారని, కానీ సూపర్ స్పెషలిటీ అస్పత్రి అవ సరం ఉన్నదని , దాన్నీ రూ. 250 కోట్లతో మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కెసి ఆర్ హయాంలో నాటి స్థానిక ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య కృషితో ట్రయల్ రన్ నిర్వహించామని,ఏఏంఆర్పి ప్రధాన కాల్వను 4 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో లైనింగ్ పనులతో కలిపి వెడల్పు చేయా లని, దీనికి సీఎంతో మాట్లాడి రూ. 1500 కోట్ల ను మంజూరు చే యించాల్సిన బాధ్యత మంత్రి కోమటిరెడ్డి తీసుకోకోవాలని సూచించారు.
రూ. 250 కోట్లతో ఉదయసముద్రం, శిల్పా రామం, ఛాయా, పచ్చల సోమేశ్వరాలయం లాంటి వాటితో పానగల్ అభివృ ద్ధిని కోనసాగించాలని, ఈ నిధు లను మళ్లీస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రజా ఉద్యమం చేపడు తామని హెచ్చరించారు. యాదాద్రి థెర్మల్ ప్రాజెక్టు ను కూలకొడ్తా అన్న మంత్రి కోమటిరెడ్డి ఇపుడు ఎలా ప్రారంభిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు పునరాలోచనలో పడ్డారని, కాంగ్రెస్ ను గెలిపించి బాధ పడుతున్నట్లు ప్రజలే బహి రంగంగా చెప్పుకుంటున్నారని తెలిపారు. తిరిగి కెసిఆర్ నాయ కత్వాన్ని ప్రజలు కోరుకుంటు న్నా రని, రేవంత్ రెడ్డి పర్యటన సంద ర్బంగా బిఆరెస్ కార్యకర్తలు నల్ల గొండ అభివృద్ధి కోసం సీఎం ను కలిసేందుకు సిద్ధమని, సూపర్ స్పెష లిటీ అస్పత్రి, మాస్టర్ ప్లాన్, అభి వృద్ధి పనుల కొనసాగింపు కోసం డిమాండ్ చేస్తున్నామ న్నారు.
కెసిఆర్ మంజూరు చేసిన పనులను కొనసాగిస్తూనే కొత్తగా నిధులు ఇవ్వాలన్నదే మా ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. నల్ల గొండ అభివృద్ధిపై, కాళేశ్వరం ప్రా జెక్టులేపై మంత్రి కోమటిరెడ్డి తో నేను చర్చకు సిద్ధమని ప్రక టించారు. ఈ మీడియా సమా వేశంలో రాష్ట్ర కల్లు గీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు కటికం సత్తయ్య గౌడ్, BRS పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్,నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,మాజీ ఎంపీపీ sk కరీం పాషా, నారబోయిన బిక్షం.. లోడంగి గోవర్ధన్..సింగిల్ విండో చైర్మన్ లు వంగాల సహదేవ రెడ్డి, దోటి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కో ఆప్షన్ సభ్యులు, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి,రంజిత్ మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస రెడ్డి,మెరుగు గోపి,బడుపుల శంకర్, ఉట్కూరి సందీప్ రెడ్డి, వనపర్తి జ్యోతి, కొప్పోలు విమలమ్మ,అవినాష్.. తదితరులు పాల్గొన్నారు.