Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KC Venugopal: ఏకాభిప్రాయం ఎప్పుడో కుదరని కూర్పు..!

–టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ మరికొంత కాలం తర్వాతే
–ఆషాఢంలోపు అస్సలు లేనట్లేన న్న సంకేతాలిస్తున్న పరిస్థితులు
–ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌ తో సిఎం రేవంత్‌ చర్చలు
–నిర్ణయం కోసం వేచి చూసే ధోరణి లో అధిష్ఠానం, నెక్స్ట్ భేటీలో ఓకే
— ఖర్గే, రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ లో కేకేశవరావు

KC Venugopal: ప్రజా దీవెన,హైదరాబాద్‌: అందరూ అనుకుంటున్నట్లు ఆషాడానికన్న ముందే ఆమాక్షల నియామకం పూర్తవుతుoదనుకున్న తరుణంలో చర్చోప చర్చలకు బ్రేక్ పడింది. ఆషాడంలోపే పిసిసి అధ్యక్షుడు మంత్రివర్గంలో మిగిలిన స్థానాల భర్తీ విషయంలో తుది నిర్ణయం వస్తుందనుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (Congress party), ప్రజలకు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదుర యింది. ఎందుకంటే మళ్లీ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీ సీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఆషాఢంలోపు పీసీసీ అ ధ్యక్షుని నియమించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుం దని అంద రూ భావించగా కాంగ్రెస్‌ మార్కు రాజకీయం తెరపైకి వచ్చిం ది టీపీసీసీ చీఫ్‌ నియామకం, మంత్రి వర్గ విస్త రణకు ముహూర్తం దాదాపు ఖరా రైన తర్వాత వాయి దా పడింది. ఈ అంశాలపై పార్టీ నేతల మధ్య ఏకా భిప్రాయం కుదర లేదని సమాచారం ఈ క్రమంలోనే బుధవారం వెలువడాల్సిన నిర్ణయం మరికొన్ని రోజు లు వాయిదా (break) పడి నట్లు తెలుస్తోంది.

టీపీసీసీ అధ్యక్షు డి నియామకం, మంత్రివర్గ విస్తర ణపైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో సీఎం రేవం త్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క, మంత్రి ఉత్త మ్‌కుమార్‌ రెడ్డి, (KC Venugopal with CM Revam Reddy, Deputy CM Bhattivikra Marka, Minister Utta Mkumar Reddy) పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌ చార్జి దీపాదాస్‌ మున్షీలు రెండు దఫాలు సమావేశమై చర్చలు జరి పిన సంగతి తెలిసిందే. ఆ సమా వేశాల్లో రూపొందించిన జాబి తాలోని పేర్లపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను దీపాదాస్‌ మున్షీ తీసుకున్నారు. ఖర్గే, రాహుల్‌తో (Kharge, Rahul) మంగళ లేదా బుధవారం సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దీపా దాస్‌ మున్షీలు సమావేశమై చర్చిం చి తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే బుధ వారం ఉదయం వరకూ సీఎం సహా నలుగురికీ ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు.

బుధవారం రోజంతా అధికారులతో సమీక్షలకు సీఎం రేవంత్‌రెడ్డి (revanth reddy) ప్రణాళిక కూడా వేసు కున్నారు. కానీ, బీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని (revanth reddy)అధిష్ఠానం బుధవారం హుటా హుటిన ఢిల్లీకి పిలిపించింది. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం.. పార్టీలో కేకే చేరిక తర్వాత ఖర్గే, రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌తో (Kharge, Rahul and KC Venugopal) సమా వేశమై చర్చలు జరిపారు. పార్టీ అగ్రనేతలతో రేవంత్‌రెడ్డి కొంతసేపు ఆంతరంగికంగానూ సంభాషించా రు. చర్చల్లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవిపై ఇంకా చిక్కుముడులు ఉన్నాయని గ్రహిం చిన అగ్రనేతలు మరోమారు భేటీ కావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్‌ నియా మకం, మంత్రివర్గ విస్తరణ ఒకదా నికొకటి ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ రెండు అంశాలపైనా మరోసారి సమావేశమవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, బుధవారం భేటీ అనంతరం ఖర్గే బెంగుళూరుకు పయనమవగా, కేసీ వేణుగోపాల్‌ కేరళ వెళ్లినట్లు సమాచారం. ఖర్గే నివాసంలో చర్చల సమయంలో పీసీసీ పదవిని ఆశిస్తున్న నేతలు మధుయాష్కీ, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సంపత్‌కుమార్‌, బలరాంనా యక్‌తోపాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వాకిటి శ్రీహరి అక్కడే ఉన్నారు. ఇక మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి రేవంత్‌ (revanth)కంటే ముందే ఖర్గేని కలిసి వెళ్లిపోయారు.