— సీఎం రేవంత్ తో భేటీ అయిన కృష్ణమోహన్
Krishnamohan:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ఆయన నివా సంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy)కలుసుకున్నారు.. ఆయనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు కూ డా ముఖ్యమంత్రి భేటి అయ్యారు.. ఇటివల బండ్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను కలిసిన నేప థ్యంలో ఆయన బిఆర్ఎస్ లోకి చేరను న్నట్లు వార్తలు వినవచ్చా యి. అయితే ముఖ్యమంత్రితో భేటి అనంతరం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని అంటున్నారు. అలాగు బండ్ల అసంతృప్తిని చల్లా ర్చేందుకు రంగంలోకి దిగిన మంత్రి జూపల్లి (Jupalli)గురువారం నాడు బండ్ల ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన బండ్ల నేడు రేవంత్ ను కలిశారు. దీంతో గద్వా ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఎపిసోడ్ ముగిసినట్లేనని రాజ కీయ వర్గాలు భావిస్తున్నాయి.