–మొబైల్ , ల్యాప్ టాప్ సమర్పిం చాలని నోటీసులు
KTR : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఫార్ములా ఈ-రేస్ కేసులో బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొబైల్, ల్యాప్ టాప్ సమర్పించ డానికి ఏసీబీ డెడ్ లైన్ విధించింది. బుధవారం సాయంత్రంలోపు మొబై ల్, ల్యాప్ టాప్ తమకు అందజేయ లని ఆదేశించారు. ఇదిలా ఉంటే మొబైల్ ల్యాప్ టాప్ ఏసీబీకి అంద జేయడంపై కేటీఆర్ తన న్యాయ వాదులతో లీగల్ ఒపీనియన్ తీసు కున్న నేపద్యంలో ఎలక్ట్రానిక్ వస్తు వులు ఏసీబీకి ఇవ్వాల్సిన అవస రం లేదని న్యాయవాదులు చెప్పా రు. దీంతో మొబైల్, ల్యాప్ టాప్ అందజే యడానికి కేటీఆర్ విముఖ త వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కేటీఆర్, ఐఏఎస్ సీనియ ర్ అధికారి అరవింద్ కుమార్ ఉమ్మ డి విచారణకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరవింద్ విదే శాల నుంచి వచ్చిన తరువాత ఆ యనకు నోటీసులు ఇచ్చి వారం రో జులలోపు ఇద్దరిని కలిపి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే అరవింద్ కుమార్ సెలవు లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిం ది. యూరప్లో ఉన్న అరవింద్ ఈ నెల 21న హైదరాబాద్కు వస్తున్న ట్లు ప్రభుత్వానికి సమాచారం అం దింది. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదే శాలతోనే నిధులు ఎఫ్ఈవో కంపె నీకి బదిలీ చేశామని అరవింద్ కు మార్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఫార్ములా-ఈ కార్ల రేసు వ్యవహారం లో, ముఖ్యంగా రేసు నిర్వహణ సం స్థ ఎఫ్ఈవో (ఫార్ములా-ఈ ఆపరేష న్స్)కు నిధుల జారీకి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అర వింద్కుమార్కు ఆదేశాలు ఇచ్చార నే కోణంలో ఏసీబీ అధికారులు వి చారణ జరుపుతున్నట్టు తెలిసింది. హెచ్ఎండీఎ ఖాతాల నుంచి ఎఫ్ఈ ఓకు నిధులు బదిలీ చేసే ముందు తనకు, కేటీఆర్కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల విషయమై ఏసీబీ విచారణ సందర్భంగా అర వింద్ కుమార్ వివరించినట్టు స మాచారం. దీనితో ఆ సమయంలో ఉపయోగించిన సెల్ఫోన్లు, ల్యాప్ టాప్ను తమకు అప్పగించాలని కే టీఆర్ను ఏసీబీ అధికారులు ఆదే శించినట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో ఏ2 నిందితుడైన ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లడంపై సీ ఎంకు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రస్తుత పరి ణామాల నేపథ్యంలో అరవింద్ కు మార్ సెలవు రద్దు చేసుకుని, వెంట నే వెనక్కి రావాలని సీఎస్ కార్యా లయం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.