Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: రాష్ట్రంలో దుర్మార్గపు ప్రభుత్వం

–ట్విట్టర్ వేదికగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR:ప్రజా దీవెన, హైదరాబాద్: తెల్లదొర ల పాలన కన్నా దుర్మార్గంగా రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt)వ్యవహరిస్తోం దని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ద్వజమెత్తారు. ఓ వైపు ప్రజా పాలన అంటూనే మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు (arrest)చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధా నాలను అవలంభిస్తారా ఇది ప్రజా పాలన కాదు, ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన అని అభివర్ణించారు. ప్రచారంలో ఒక మాట, ప్రభుత్వం లోకి వచ్చాక మరో మాట మాట్లా డుతున్న సీఎం రేవంత్ రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందనన్నారు.తెలంగా ణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రె స్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ (twitter)వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పిం చారు.

నయవంచక సర్కారు ఇది అంటూ సీఎం రేవంత్‌కు (CM Revanth) యువతపై ప్రేమ లేదని, నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదని, నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇదంటూ దు య్యబట్టారు. ఎన్నికల్లో నిరుద్యోగు లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకో మం టే ఇంత నిర్బంధమా అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషర తుగా వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ నియామకాలు (Job placements) చేపట్టడం లో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లో అట్టర్ ఫ్లాప్ అయినందుకు వెంటనే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలు వునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కా ర్‌ను ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయమని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.