–సింగరేణిపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల కుట్ర
–సంస్థను ప్రైవేటీకరించేందుకే బొగ్గు వేలం
–నిరుద్యోగులకు కాంగ్రెస్ దగా చేసింది
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్ : కేంద్రం అనాలోచిత నిర్ణయాలకు అను కూలంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పని చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ (ktr) ఆరోపించారు. ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. లాభా ల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టే యాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని, సంస్థను ప్రైవే టీకరించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ బొగ్గు బ్లాకులను కేంద్రం (central)వేలం వేసిందని పేర్కొన్నారు. తర్వా త సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టు బడుల ఉ పసంహరణకు సిద్ధమవుతోందని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో సింగరేణి ప్రాంత పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో కేటీఆర్ సమావేశమై పలు అంశా లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తొమ్మిదిన్న రేళ్ల బీఆర్ఎస్ (brs) పాలనలో సింగరేణిఅభివృద్ధికి కృషి చేశామని, కేంద్రం ఒత్తిడి తెచ్చినా తెలంగాణ బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ఆప గలిగామని తెలిపారు. కార్మికులతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటుందని, ఇందుకుగాను ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ వెల్లడిం చారు. అధికారం చేపట్టగానే మెగా డీఎస్సీ వేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రి య మొదలు పెడతామని, గ్రూప్- 2లో రెండు వేలు, గ్రూప్-3లో 3 వేల ద్యోగాలు పెంచుతామన్న రేవం త్ రెడ్డి హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని ఆరోపించారు. గురువారం నందినగ ర్ లోని తన నివాసంలో నిరుద్యోగు లతో కేటీఆర్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మెయిన్స్క 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని విపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ (demand)చేసిన భట్టి విక్రమార్క (batti vikramarka) ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు తిరగబడే రోజు వస్తుందని, వారికి మద్దతుగా కదం తొక్కుతామని కేటీఆర్ (ktr)వెల్లడించారు.
సీతారామ ప్రాజెక్టును 70 శాతం మేమే కట్టాం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్ర దాయిని అయిన సీతారామ ప్రాజెక్టు పనులు తమ హయాం లోనే 70 శాతం పూర్తయ్యాయని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడం ఆనందంగా ఉందని కేటీఆర్ (ktr) పేర్కొన్నారు. కేసీఆర్ మహా సంకల్పం నెరవేరిన రోజు ఇది అంటూ గురువారం ఎక్స్ వేదికగా ప్రాజెక్టు విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అంద నుందని తెలిపారు.