Lok Adalat: ప్రజాదీవెన నల్గొండ :జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ వారి ఆధ్వర్యం లో శనివారం జిల్లా లోని అన్ని కోర్ట్ ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్, చెక్ బౌన్స్ (ఎన్ ఐ ఆక్ట్ కేసులు) ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడింది.ఈ లోక్ అదాలత్ కోసం జిల్లా వ్యాప్తంగా 12 లోక్ అదాలత్ బెంచిలను ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేశారు.
ఈ లోక్ అదాలత్ లో 38 సివిలు, 15837 క్రిమినలు, 85 మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, 28 బ్యాంకు కేసులు, 25 సైబర్ క్రైమ్ కేసులు, 80 ట్రాన్స్ కొ, 5567 ట్రాఫిక్ చాలాన్ కేసులు, మొత్తం 21660 (పెండింగ్, ప్రీ లిటిగేషన్) కేసులు పరిష్కరించబడ్డాయి.
ఇందులో ప్రమాద భీమా కేసులలో రూ.47529000 నష్టపరిహారం ఇప్పించగా, రూ.3021000 బాంక్ కేసులలో రుణ పరిహారం ఇప్పించడము సైబర్ క్రైమ్ కేసులో రికవరీ డబ్బులు రూ. 203112 యిప్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి పి. పురుషోత్తం రావు, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంత రెడ్డి, మంద నగేష్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.